తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ వీసీ సజ్జనార్ అంటే తెలియని వారుండరు.. క్రైంకు సంబంధించిన కేసులను డీల్ చేయడంతో ఆయనకు ఆయనే సాటి. ఐపీఎస్ అధికారిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో దేశంలోనే ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఐపీఎస్ అధికారిగా తన మార్క్ తో గుర్తింపు తెచ్చుకున్న సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ ఎండీగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉండగా అతడు సాధారణ ప్రయాణికుడు ఎలా బస్సులో ప్రయాణం చేస్తారో.. అలానే అతడు కూడా సాధారణ వ్యక్తిగా ప్రయాణించారు. బస్సు కండెక్టర్కు, ఇతర ప్రయాణికులు తానెవరో చెప్పకుండా ప్రయాణం చేశారు. అంతేకాకుండా తోటి ప్రయాణికులతో వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అతడు లక్డీకాపూల్ వద్ద గండి మైసమ్మ వైపు వెళ్లే బస్సు ఎక్కాడు.
కండెక్టర్ కు తనెవరో చెప్పకుండా.. టికెట్ తీసుకొని మరీ ఇలా ప్రయాణించాడు. అంతేకాకుండా అక్కడ నుంచి మళ్లీ ఎంజీబీఎస్ వెళ్లి అక్కడ సాధారణ వ్యక్తిలా కలియతిరుగుతూ.. పరిశుభ్రతను పరిశీలించారు. బస్టాండులోని మరుగుదొడ్ల పరిశుభ్రతను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా ప్లాట్ఫాంపై నిలబడి ఉన్న సిబ్బందితో కూడా మాట్లాడి ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఖాళీగా ఉన్న స్టాల్స్ను వెంటనే భర్తీకి చర్యలు చేపట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా రాబోయే దసరాకు అదనపు బస్సులు నడుపుతూ.. ఆదాయాన్న పెంచుకోవాలంటూ సూచించారు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా సాధారణ ప్రయాణికుడిగా.. తిరుగుతూ.. తన విధిలో భాగంగా వివరాలను తెలుసుకున్న అతడి సింప్లిసిటీని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…