Featured

నిరుద్యోగులకు అలర్ట్.. రాతపరీక్ష లేకుండా భారీ వేతనంతో ఉద్యోగాలు..?

యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్‌) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 244 ట‌్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష లేదు. మార్కులను ఆధారంగా చేసుకుని ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పది, ఇంటర్ మార్కులను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. http://uraniumcorp.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. పదోతరగతి 50 శాతం మార్కులతో, ఐటీఐ సంబంధిత ట్రేడ్ లో 60 శాతం మార్కులతో పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఖాళీల విషయానికి వస్తే ఫిట్ట‌ర్ 80, ఎల‌క్ట్రిష‌న్ 80, వెల్డ‌ర్ 40, ట‌ర్న‌ర్ లేదా మెషినిస్ట్ 15, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 10, ఎంవీ మెకానిక్ 10, కార్పెంట‌ర్ 5, ప్లంబ‌ర్ 4 ఖాళీలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదట్లో తక్కువగానే వేతనం లభించినా అనుభవం పెరిగే కోద్దీ వేతనం పెరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago