Featured

సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం సినిమా గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.! అప్పట్లో బాహుబలి రేంజ్..!

Published

on

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో విజయవంతమైన సినిమాలలో “సింహాసనం” సినిమా ఒకటి అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమా విడుదలై దాదాపు 35 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ తరం వారికి ఈ సినిమా గురించి బహుశా తెలియకపోయి ఉండొచ్చు.ఈ సినిమాలోని ప్రత్యేకత గురించి తెలిస్తే మాత్రం వెంటనే ఈ సినిమాను చూడకుండా ఉండలేరని చెప్పవచ్చు. మరి కృష్ణ గారు నటించిన “సింహాసనం” సినిమా ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

కృష్ణ సింహాసనం సినిమా దర్శకత్వం, నిర్మాత, ఎడిటర్, హీరో అన్ని సూపర్ స్టార్ కృష్ణ గారే వ్యవహరించారు. అంతేకాకుండా తెలుగులో మొట్టమొదటి 70 ఎంఎం స్టీరియోఫోనిక్‌ సౌండ్‌ సినిమా కూడా ఇదే అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రత్యేకత గురించి సింపుల్ గా చెప్పాలంటే 80 సంవత్సర కాలంలో ఈ సినిమా కూడా ఒక బాహుబలి సినిమా అని చెప్పవచ్చు. సింహాచలం సినిమా వసూళ్ల విషయంలో కానీ, రికార్డుల విషయంలో కానీ బాహుబలి సినిమాకు ఏ మాత్రం తీసిపోదని చెప్పవచ్చు.

ఈ సినిమా విడుదలైన సమయంలో సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు 12 కిలోమీటర్ల మేరా లైన్లో వేచి ఉన్నారంటే ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించడం కోసం 3.5 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఈ కింద 5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ చెన్నైలో నిర్వహించగా కార్యక్రమానికి కృష్ణ అభిమానులు నాలుగు వందల బస్సులలో అక్కడికి చేరుకున్నారు. ఈ విధంగా 35 సంవత్సరాల క్రితమే అద్భుతమైన రికార్డులను సృష్టించిన సినిమా కృష్ణ నటించిన సింహాసనం సినిమా అని చెప్పవచ్చు.

Advertisement

Trending

Exit mobile version