అయ్యయ్యో వద్దమ్మ… సుఖీభవ సుఖీభవ .. అంటూ సోషల్ మీడియాలో ఓ వీడయో ద్వారా ఫెమస్ అయిన శరత్ పై దాడి ఘటన ఇప్పుడు బాగా సంచలనం అయింది. శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫొటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. 10 మంది యువకులు డ్యాన్సర్ శరత్ పై కర్రలు , రాడ్ లతో దాడి చేశారు. కన్ను వాపు వచ్చేలా కొట్టిన యువకులపై అతను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అస్సలు అతడిని ఎవరు కొట్టారు.. దీనికి గల కారణం ఏంటనేది నిన్న రాత్రి నుంచి విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.
అయితే దీనిపై అతడు క్లారిటీ ఇచ్చాడు. గతంలో శరత్ చెల్లిని సాయి, హరి అనే వర్గం వేధిస్తున్నాడని అతడు మందలించాడు. దీంతో శరత్ పై వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. తర్వాత ఇటీవల అతడు జైలు నుంచి బయటకు వచ్చి.. సుఖీభవ.. సుఖీభవ అంటూ వైరల్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ అవ్వడం.. దీనిలో అతడు హిజ్రాలను కించ పరిచేలా వీడియో చేశాడని..
హిజ్రాలు అతడిపై దాడి చేశారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అది నిజం కాదని.. తాను సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యానని.. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని.. అందుకే కొంతమంది తనపై కక్షకట్టి ఓ వర్గం దాడి చేశారని అతడు చెప్పుకొచ్చాడు. తనకు సినిమాలో రెండు ఆఫర్లు వచ్చాయని.. ఇది తట్టుకోలేక కొంతమంది తనపై దాడి చేశారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…