Unni Mukundan: ప్రముఖ మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కేవలం మలయాళ చిత్రాలలో మాత్రమే కాకుండా తమిళం తెలుగు భాషలలో కూడా పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఈయన ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతూనే వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.
2018 వ సంవత్సరంలో కొట్టాయం టౌన్కు చెందిన ఓ యువతి నటుడు ఉన్ని ముకుందన్ సినిమా స్టోరీ చెబుతానంటూ తనని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఆ యువతి ఫిర్యాదు చేయడంతో 2018 సెప్టెంబర్ 15వ తేదీన కేసు నమోదు చేసుకున్న అనంతరం నటుడు ఉన్ని ముకుందన్ ను కోర్టులో కూడా హాజరు పరిచారు.
ప్రముఖ న్యాయవాది సైబీ జోస్ కిడంగూర్ ఉన్ని తరపున కేసును వాదించారు. యువతితో రాజీ చేసుకున్నట్లు కోర్టుకు ఓ పత్రం చూపించడంతో కోర్టు ఈ కేసును కొట్టివేసింది.ఇలా కోర్టు ఈ కేసు కొట్టి వేయడంతో ఉన్ని స్టే ఆర్డర్ పై ఉంటున్నారు. అయితే, జోస్ కిడంగూర్ కోర్టుకు చూపించిన పత్రంపై తాను సంతకంచేయలేదంటూ ఆ యువతి కేరళ హైకోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
ఇలా ఆ యువతి తాను ఎలాంటి సంతకం చేయలేదంటూ వాంగ్మూలం ఇవ్వడంతో కేరళ హైకోర్టు నటుడు ఉన్ని ముకుందన్ కు చిన్న జలక్ ఇచ్చింది. దీంతో కోర్టు సైబీ జోస్ కిడంగూర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసిన తప్పుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించడమే కాకుండా ఉన్ని ముకుందన్ పై ఉన్నటువంటి స్టే ఆర్డర్ విత్ డ్రా చేసుకుంది. ఇలా ఈ కేస్ తిరిగి మళ్లీ మొదటికే వచ్చిందని చెప్పాలి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…