ప్రొడ్యూసర్ పాత్ర కేవలం డబ్బు పెట్టి వెళ్లిపోవాలి అన్నట్టుగా మారిపోయిందని ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ తెలిపారు. ప్రస్తుత పరిస్థితి అంతకన్నా దారుణంగా తయారైందని, ఇప్పుడైతే అది హీరో, డైరెక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన చెప్పారు. ఇకపోతే కొందరు హీరోలు మాత్రం అలా ఉండరని ఆయన అన్నారు. ఉదాహరణకు బాలకృష్ణను తీసుకుంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు గానీ, ప్రొడక్షన్లో అసలు ఇన్వాల్వ్ అవ్వరని ఆయన చెప్పారు.
కొంతమంది హీరోలైతే ప్రొడక్షన్లో కల్పించుకొని, ఈ సీన్ ఆస్ట్రేలియాలో చేయాలి, యూరప్లో చేయాలి అనటం. డైరెక్టర్, హీరో ఒకటైపోవడం వాళ్లు అనుకున్నది చేయడం చేస్తారని,ఇలా మనకు తెలియకుండా మన బాధ్యతలను కూడా వాళ్ళే తీసుకుంటారని నిర్మాత వెల్లడించారు.
ప్రస్తుతం గురించి చెప్పాలంటే డబ్బు ఎవరిదైనా డబ్బే.. నిర్మాత సినిమా కోసం ఇంత ఖర్చు పెట్టాడు. తనకు లాభం వచ్చేలా చేయాలని లేదని ఆయన అన్నారు. 100 కోట్ల మార్కెట్ ఉంది కదా.. 50 కోట్లు ఎందుకు రావాలి, 20 కోట్లు వస్తే చాలదా.. లేదంటే తనతో సినిమా చేశారు కదా పేరొస్తే చాలదా.. ఖర్చు పెట్టించేద్దాం అని పిచ్చి ఆలోచనలతో ఇండస్ట్రీ మరింత నాశనం అవుతోందని ఆయన వివరించారు.
అలా కాకుండా ఓ పద్దతి ప్రకారం ఆలోచించి, నేనింత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్లు నిర్మాతకి కూడా డబ్బులు మిగలాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని ఆయన చెప్పారు.
ఇకపోతే ఒక సినిమాలో డైరెక్టర్ చెప్పారని నటుడు ఉపేంద్ర గారిని గడ్డం తీయమని అడిగినట్టు ఆయన తెలిపారు. దానికి ఆయన నేను తీయను. ఇలాగే ఉంటాను. మీరే ఆలోచించుకోండి అని అన్నట్టు ఆయన చెప్పారు. ఇక ఏం చేసేది లేకపోవడంతో ఆయన ఆ సినిమాలో అలానే నటించారని నిర్మాత అంబికా కృష్ణ వివరించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…