Vakkantham Vamsi : దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన వక్కంతం వంశీ రచయితగా దర్శకుడిగా మనందరికీ సుపరిచితమే. ఈటీవీ లో వ్యాఖ్యతగా మొదటిసారి తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వంశీ సీరియల్స్ లో కూడా నటించారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అశోక్’ సినిమాకు కథను అందించి రచయితగా మారారు. ‘కిక్’ సినిమాతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న వంశీ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారాడు. తన సినీ ప్రయాణంలో జరిగిన చాలా విషయాలను వంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
జూ. ఎన్టీఆర్ తో సినిమా ఆగిపోవడానికి కారణం…
వక్కంతం వంశీకి జూ. ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. దీని గురించి వంశీ కూడా చాలా సార్లు చెప్పుకొచ్చారు. చిరంజీవి తన అభిమాన నటుడని, వ్యక్తిగత జీవిత ప్రయాణంలో తాను ఎక్కువగా అభిమానించే వ్యక్తి తారక్ అని వంశీ చెప్పుకొచ్చారు. తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎన్టీఆర్ గురించి ఆలోచించగానే చిరునవ్వు తెలియకుండానే వచ్చేస్తుందని చెబుతూ ఎన్టీఆర్ మీద తనకున్న అభిమానాన్ని తెలియజేసారు. కెమెరా ముందు ఎన్టీఆర్ ని చూడగానే ఇప్పటివరకు నాతో గంటలు గంటలు మాట్లాడిన వ్యక్తేనా అని ఆశ్చర్యం వేస్తుందని చెప్పుకొచ్చారు.
నేను ఎన్టీఆర్ కలసి సినిమా చేయాలనుకుని అది పట్టాలెక్కకపోవడంతో అందరూ చాలా రకాలుగా మాట్లాడారని, ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని అన్నారని, కానీ అవేవి నిజం కాదని చెప్పారు. ఆ సినిమా కుదరకపోవడానికి కారణం ఇద్దరూ అనుకున్నట్లుగా కథ కుదరకపోవడమే. కథ సెట్ అవ్వట్లేదని, బడ్జెట్ పెరిగిపోతుందేమోనని ఒకటి ఇలా చాలా కారణాలు ఉన్నాయి. సరే ఇది కుదరట్లేదు నేను మరో సినిమా చేసుకొని వస్థానని పక్కకు రావడం జరిగిందే కానీ వేరే కారణాలు లేవని ఆయన చెప్పారు. అయితే నాకు చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉందని, రెండు మూడు సార్లు ప్రయత్నం కూడా చేసినా కుదరలేదని చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…