Featured

Vande Bharath Express: తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కానుక ఇచ్చిన మోడీ… వందే ఎక్స్ ప్రెస్ తో ఇక ఈజీ జర్ని… టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే…!

Vande Bharath Express : కేంద్రప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగ గిఫ్ట్ ఇచ్చింది. దేశంలో ఎనిమిదవ ఫాస్ట్ ట్రైన్ అయిన వందే భారత్ ను ప్రారంభించింది. సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు వెళ్లే ఈ ట్రైన్ ను ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జనవరి 16న ప్రారంభం అయిన ఈ ట్రైన్ విశేషాలు, టికెట్ ధరల గురించి తెలుసుకుందాం.

తగ్గిన ప్రయాణ సమయం… సామాన్యులకు ఊరట…

సంక్రాంతి లాంటి పండగలు వచ్చాయాంటే హైదరాబాద్ నుండి విజయవాడ అటు కోస్తా జిల్లాలకు వెళ్లే జనంతో ఎక్కువ ఆ సమయంలో బస్సులు, ట్రైన్లు కిక్కిరిసిపోతాయి. అదీ కాక ప్రయాణం ఎక్కువ సేపు అయితే ఇప్పుడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ వల్ల ప్రయాణం సమయం నాలుగు గంటలు తగ్గనుంది. సికింద్రాబాద్ నుండి విజయవాడ కు 4 గంటల 20 నిమిషాల సమయం అలాగే సికింద్రాబాద్ నుండి వైజాగ్ వెళ్లాలంటే 8 గంటల 30 నిమిషాల సమయం పట్టనుంది.

సౌత్ లో ప్రవేశ పెట్టిన రెండో వందే భారత్ ట్రైన్ ఇది. వైజాగ్ నుండి రాజమండ్రి, విజయవాడ స్టేషన్స్ లో ఆగుతుంది ట్రైన్. అలాగే తెలంగాణ లో ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ లో ఆగుతుంది. ఆదివారం మినహా వైజాగ్ లో ఉదయం 5:45 నిమిషాలకు ట్రైన్ బయలుదేరుతుంది. 1100 సీట్ల కెపాసిటీ తో ఉన్న ఈ హై స్పీడ్ ట్రైన్ నిన్నటికే 70 % టికెట్స్ బుక్ అయ్యాయి. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే చెయిర్ కార్ కేటగిరి కాస్ట్ రూ. 1720గా ఉంది. ఎగ్జిక్యూటివ్ చెయిర్ ధర రూ. 3170. ఫుడ్, ట్యాక్సులు కలుపుకొని ఈ ధరలు ఉంటాయి. ఈ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. రెండు ఎగ్జిక్యూటివ్ చెయిర్స్ కోచ్‌లు ఉంటాయి.

Bhargavi

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

5 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

5 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

5 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

6 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

8 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

8 hours ago