Featured

Vande Bharath Express: తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కానుక ఇచ్చిన మోడీ… వందే ఎక్స్ ప్రెస్ తో ఇక ఈజీ జర్ని… టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే…!

Vande Bharath Express : కేంద్రప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగ గిఫ్ట్ ఇచ్చింది. దేశంలో ఎనిమిదవ ఫాస్ట్ ట్రైన్ అయిన వందే భారత్ ను ప్రారంభించింది. సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు వెళ్లే ఈ ట్రైన్ ను ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జనవరి 16న ప్రారంభం అయిన ఈ ట్రైన్ విశేషాలు, టికెట్ ధరల గురించి తెలుసుకుందాం.

తగ్గిన ప్రయాణ సమయం… సామాన్యులకు ఊరట…

సంక్రాంతి లాంటి పండగలు వచ్చాయాంటే హైదరాబాద్ నుండి విజయవాడ అటు కోస్తా జిల్లాలకు వెళ్లే జనంతో ఎక్కువ ఆ సమయంలో బస్సులు, ట్రైన్లు కిక్కిరిసిపోతాయి. అదీ కాక ప్రయాణం ఎక్కువ సేపు అయితే ఇప్పుడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ వల్ల ప్రయాణం సమయం నాలుగు గంటలు తగ్గనుంది. సికింద్రాబాద్ నుండి విజయవాడ కు 4 గంటల 20 నిమిషాల సమయం అలాగే సికింద్రాబాద్ నుండి వైజాగ్ వెళ్లాలంటే 8 గంటల 30 నిమిషాల సమయం పట్టనుంది.

సౌత్ లో ప్రవేశ పెట్టిన రెండో వందే భారత్ ట్రైన్ ఇది. వైజాగ్ నుండి రాజమండ్రి, విజయవాడ స్టేషన్స్ లో ఆగుతుంది ట్రైన్. అలాగే తెలంగాణ లో ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ లో ఆగుతుంది. ఆదివారం మినహా వైజాగ్ లో ఉదయం 5:45 నిమిషాలకు ట్రైన్ బయలుదేరుతుంది. 1100 సీట్ల కెపాసిటీ తో ఉన్న ఈ హై స్పీడ్ ట్రైన్ నిన్నటికే 70 % టికెట్స్ బుక్ అయ్యాయి. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే చెయిర్ కార్ కేటగిరి కాస్ట్ రూ. 1720గా ఉంది. ఎగ్జిక్యూటివ్ చెయిర్ ధర రూ. 3170. ఫుడ్, ట్యాక్సులు కలుపుకొని ఈ ధరలు ఉంటాయి. ఈ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. రెండు ఎగ్జిక్యూటివ్ చెయిర్స్ కోచ్‌లు ఉంటాయి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago