Featured

Varahi vehicle issue : తెలంగాణాలో రిజిస్ట్రేషన్ అయిన పవన్ కళ్యాణ్ వారాహి… ఏపీ లో అడుగుపెడితే సీజ్ చేస్తారా?? ఆర్టిఏ అధికారి ప్రసాద్

Varahi vehicle issue : పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కొన్న కొత్తవాహనం వారాహి. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కొత్త చర్చ ఈ వాహనం గురించే. ఆ వాహనం రంగు ఆర్మీ వాళ్ళ వాహనాల రంగు ఉండటం వల్ల అది ఎలా రిజిస్ట్రేషన్ చేసారంటూ వాదించారు చాలా మంది వైసీపీ నాయకులు. అసలు ఏపీ లో తిరగనివ్వబోము అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ వివాదాల నడుమ ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ సవ్యంగా జరిగిందా అన్న విషయాల గురించి ఆర్టిఏ అధికారి ప్రసాద్ గారు వారాహి గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్… ఏపీ లో వెహికల్ సీజ్ చేయొచ్చా…

ఆర్టిఏ అధికారి ప్రసాద్ గారు వారాహి వెహికల్ గురించి సందేహలపై క్లారిటీ ఇస్తూ అది నాన్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ గా రిజిస్టర్ అయింది అంటూ చెప్పారు. అందువల్ల మరో స్టేట్ కి వెళితే పర్మిట్ తీసుకోవాల్సిన పనిలేదు అంటూ తెలిపారు. ఇక రంగు విషయం మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ అపుడు వాళ్ళు ఆర్మీ రంగు కాదు అని నిర్ధారించే రిజిస్ట్రేషన్ చేసారు. ఫోటోలు చూసి రంగును నిర్ధారించలేము అది ఏమ్రాల్డ్ గ్రీన్ రంగు వెహికల్.

అయితే రక్షణ శాఖ వాహనాల రంగు ఆలీవ్ గ్రీన్, ఆ రంగు ఎవరూ వాడకూడదు. ఇక తెలంగాణ లో రిజిస్టర్ అయిన వెహికల్ ఆంధ్రప్రదేశ్ లో తిరగకూడదు అనే నిబంధన లేదు. ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ జరిగినా మిగిలిన రాష్ట్రాల్లో తిరగవచ్చు. కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే కానీ అందులో వాస్తవాలు లేవు అంటూ ప్రసాద్ గారు క్లారిటీ ఇచ్చారు.

Bhargavi

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

13 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

14 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

14 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

14 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

16 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

17 hours ago