Varalakshmi Sarath Kumar: కథానాయకగా, ప్రతి కథ నాయకగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఎలా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోడా పోడి సినిమాతో వెండితెరకు పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత తెలుగు తమిళ్ హిందీ కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా లేడీ విలన్ గా కూడా నటించి మంచి గుర్తింపు పొందింది.
ఇక దీంతో లేడీ విలన్ క్యారెక్టర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇలా దశాబ్ద కాలంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో నటిస్తూ బిజీగా ఉంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ఒక భేటీలో పాల్గొనింది. ఈ క్రమంలో తన సినీ జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతే కాకుండా తన తండ్రి వల్ల మంచి మంచి అవకాశాలు కోల్పోయానని షాకింగ్ కామెంట్స్ చేసింది.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ…” శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా బాయ్స్. ఆ సినిమాలో జెనీలియా పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ పాత్ర కోసం ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. ఆ సినిమాలో నటించటానికి ఆసక్తిగా ఉన్న సమయంలో నాన్న అనుమతించలేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమా లో కూడా హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిందని, అయితే అప్పుడు కూడా నాన్న నిరాకరించడంతో ఆ అవకాశం కూడా చేశారు పోయిందని తెలిపింది.
మొదట చదువు ఆ తర్వాతే నటన అని నాన్న తేల్చి చెప్పడంతో ఇలా మంచి మంచి అవకాశాలు చేజారిపోయాయని వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటించి మరొకసారి తన నటనతో ప్రేక్షకులను అలరించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…