బుల్లితెర యాంకర్ లలో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వారిలో వర్షిని ఒకరు. అనసూయ శ్రీముఖి కంటే ఎక్కువగా తన గ్లామర్ ను ఆరబోస్తూ కుర్రకారుల కన్ను మీద కునుకు లేకుండా చేస్తోంది. బుల్లితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వర్షిణి.. బుల్లితెర రియాలిటీ షో యాంకర్ గా చేసింది.
ఢీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో ఎంట్రీ ఇస్తూ తన అద్భుతమైన స్టెప్పులతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ స్టార్ మాలో ప్రసారం అవుతున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి వచ్చారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇందులో రష్మీ, వర్షిని పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓంకార్ రష్మీ పై పొగడ్తల వర్షం కురిపించారు. అదేవిధంగా వర్షిని పొట్టి డ్రెస్ వేసుకొని రచ్చ రచ్చ చేశారు. ఇక ఈ షోలో భాగంగా వర్షిని, రష్మీ ని వాదించగా.. అప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ తో ‘ఇవే తగ్గించుకుంటే మంచిది’ అనే డైలాగ్ రావడంతో వర్షిని వెంటనే స్పందించారు.
వర్షిని మాట్లాడుతూ… ఏంటి తగ్గించుకోవాలి ఆల్రెడీ ఇంత తగ్గించుకునే వచ్చాను అంటూ.. తన పొట్టి డ్రెస్ చూపిస్తుంది. ఈ విధంగా పొట్టి డ్రెస్సులో అద్భుతమైన తీన్మార్ స్టెప్పులతో అదరగొడుతున్న వర్షినినీ, రష్మీ ఇక చాలు అన్నట్టుగా అక్కడి నుంచి వెనక్కి తీసుకువెళ్లడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…