2003వ సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గంగోత్రి.ఈ సినిమాలో అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా ద్వారా అదితి అగర్వాల్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కురిపించింది. ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. చిన్నికృష్ణ కథను అందించారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో నటించే అద్భుతమైన అవకాశాన్ని ఒక స్టార్ డైరెక్టర్ వదులుకున్నాడు.
వెంకీ మామ, బలుపు, జై లవకుశ వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు బాబీ గురించి అందరికీ తెలిసిందే. గంగోత్రి సినిమా షూటింగ్ సమయంలో బాబికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాబి చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ క్రమంలోనే రైటర్ చిన్ని కృష్ణ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తనను కలవమని బాబికి చెప్పారు. ఈ క్రమంలోనే గంగోత్రి సమయంలో తనకు సినిమాల్లో అవకాశం కల్పించమని బాబి చిన్ని కృష్ణని కోరడంతో వెంటనే రాఘవేంద్రరావు దగ్గరకు తీసుకు వెళ్లగా అందుకు రాఘవేంద్రరావు సరేనని ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే బాబీని నిక్కర్ వేసుకోవాలని అందుకు కొలతలు తీసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ కి తెలియజేశారు.
సినిమాలలో నిక్కర్ తొడిగితే గుంటూరులో తన పరువు పోతుందని భావించిన బాబి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. నిజానికి గంగోత్రి సినిమాలో బాబీని హీరో స్నేహితుని పాత్రలో నటించడం కోసం తీసుకోవాలని భావించినప్పటికీ బాబి ఈ సినిమాను వదులుకున్నారు.ఈ సినిమాలో నేను నటించనని చిన్ని కృష్ణతో చెప్పినప్పుడు చిన్ని కృష్ణ మరి ఏం చేస్తావని అడగగా కథలు రాస్తానని చెప్పాడట. ఇక ఈ సినిమాలో కొన్ని సీన్స్ రాయమని చెప్పగా ఎంతో అద్భుతంగా బాబి రాసి ఇవ్వడంతో అప్పటినుంచి రైటర్ గా ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎంతో బిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…