Vasanthi: తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమాన్ని కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ప్రస్తుతం సీజన్ సిక్స్ ప్రసారమవుతూ 10 వారాలను పూర్తి చేసుకుంది. ఇలా ఈ కార్యక్రమం 10 వారాలు పూర్తి కావడంతో 11 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు పదవ వారం ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది.
ఈ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం బాలాదిత్య బయటకు రాగా ఆదివారం గ్లామర్ డాల్ వాసంతి బయటకు వచ్చారు.ఇక ఈమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడం విశేషం ఇలా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె కెరియర్ మొదట్లో మోడల్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. అనంతరం సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీఫ్లవర్, వాంటెడ్ పండుగాడ్ సినిమాలలో నటించి బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో 10 వారాలపాటు కొనసాగిన ఈమె పదవ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.బయటకు రావడంతో తనకు 10 వారాలు పాటు హౌస్ లో కొనసాగడం కోసం ఎంతో కృషి చేసి తనకు సపోర్ట్ చేసిన అభిమానులకు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా బయటకు రావడంతోనే జై పవన్ అంటూ ఈమె నినాదాలు చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు తనకు అవకాశం ఇస్తే జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక పవన్ కళ్యాణ్ సినిమాలోని అవకాశం వస్తే నటిస్తారా అని ప్రశ్నించగా ఛాన్స్ రావాలి కానీ ఎందుకు నటించను అంటూ పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…