Veera Simha Reddy twitter review : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ వీర సింహా రెడ్డి. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో, బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. ఈ చిత్రాన్ని వై.రవిశంకర్ మరియు నవీన్ యెర్నేని నిర్మించారు. అఖండ సినిమా విజయంతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న బాలయ్య బాబు, క్రాక్ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న గోపిచంద్ మలినేనిల కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులలో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల సినిమా ప్రివ్యూస్ పడ్డాయి, అవి చూసిన ప్రేక్షకులు తమ అనుభవాన్ని సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కథ, కథనం ఎలా ఉన్నాయంటే…
ఎంతగానో ఎదురు చూస్తున్న వీర సింహా రెడ్డి చిత్రం జనవరి 12 న ప్రేక్షులముందుకు రానే వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా మంచి హిట్ టాక్ తో అలరించాయి. ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకులు తమ స్పందన తెలియజేశారు. చిత్రంపై అటు పాజిటివ్ ఇటు నెగెటివ్ కామెంట్స్ తో మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ రొటీన్ గా ఉంది, ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఏవరేజ్ గా ఉంది, సినిమాలో బాలయ్య మాస్ మిస్ అయ్యింది అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే మరి కొందరు మాత్రం వీర సింహా రెడ్డి సినిమాతో మరోసారి బాలయ్య బాబు మాస్ జాతర మొదలైందని చెప్తున్నారు. దునియా విజయ్ ఇంకా శ్రుతి హాసన్ నటన బాగుందని కామెంట్ చేశారు.
ఇక మరో ప్రేక్షకుడు పోస్ట్ చేస్తూ సినిమాలో బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయని ఎలివేషన్స్, ఎమోషన్స్ వర్క్ అవుట్ అయ్యాయి.పెద్ద బాలకృష్ణ పాత్ర ఆకట్టుకుందని పంచుకున్నాడు. సినిమాలో పెళ్లి ఫైట్ సీన్, పులిచర్ల మైలు రాయి వద్ద ఫైట్, మినిస్టర్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ బాగున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అనే టాక్ ఒకా వైపు వినిపిస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం సినిమా సూపర్ అంటూ చెబుతున్నారు. అయితే సినిమా ఫలితం ఖచ్చితంగా తెలియాలంటే మాత్రం ఇంకా వేచి చూడాలి. ఇప్పటికైతే వీర సింహా రెడ్డి మిశ్రమ స్పందనతో దూసుకుపోతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…