Venkatesh: ఒకప్పుడు హీరో హీరోయిన్ల గురించి తెలుసుకోవాలంటే కేవలం వార పత్రికల ద్వారా మాత్రమే వారి గురించి తెలుసుకునేవారు అయితే సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఒక హీరో గురించి లేదా హీరోయిన్ గురించి తెలుసుకోవాలంటే క్షణం సమయం పట్టదు. సోషల్ మీడియాలో ఒక నటికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది నటీనటులు ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారికి సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా వారి సినిమా విషయాలను కూడా షేర్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం హీరోలు మాత్రమే కాకుండా వారి భార్యాపిల్లలు కూడా సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.
ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఒక్కో పోస్టులతో భారీగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు.అయితే తనకు మాత్రం ఇలాంటి పాపులారిటీ ఇలాంటి సంపాదన వద్దు అంటూ ఏకంగా తను మాత్రమే కాకుండా తన ఫ్యామిలీని కూడా మీడియాకు దూరంగా ఉంచారు నటుడు దగ్గుబాటి వెంకటేష్.హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వెంకటేష్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. అలాగే తన భార్య పిల్లలను కూడా ఈయన సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంచారు.
ఇలా తన భార్య పిల్లలను కూడా దూరంగా ఉంచడానికి గల కారణం తనకు తన కుటుంబాన్ని మీడియా ముందుకు తీసుకురావడం ఏమాత్రం ఇష్టం లేదని తన కుటుంబ పరిధి వరకే తన విషయాలు తెలిసి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటమే తనకిష్టమని తెలిపారు. తన వ్యక్తిగత విషయాలన్నింటిని అలాగే తన కుటుంబ సభ్యులను అందరికీ పరిచయం చేయడం అందరితో వారి విషయాలను పంచుకోవడం ఇష్టం లేనటువంటి వెంకటేష్ తన భార్య నీరజ అలాగే పిల్లలను కూడా పూర్తిగా సోషల్ మీడియాకు దూరం పెట్టారు. ఈ మధ్యకాలంలో తన కుమార్తె ఆశ్రిత సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య రానా సమంత వంటి వారు చేసిన పోస్టులకు రిప్లై ఇస్తూ ఉంటారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…