Venuswamy: ఇటీవల తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క ఎన్నికలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. బర్రెలక్కగా ఎంతో ఫేమస్ అయినటువంటి శిరీష యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు అయితే ఈమె తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు.
ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఈమె అతి తక్కువ ఓట్లతో పరాజయం పాలయ్యారు. అయితే తాజాగా ఈమె గురించి వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బర్రెలక్క వీడియోలు చేసుకుంటూ తన జీవితం తాను గడిపేదని కానీ సోషల్ మీడియా వల్ల ఆమెను కొందరు ఎన్నికల వైపు దృష్టి సారించేలా చేసి తనని ఎన్నికలలో నిలబెట్టారని తెలిపారు.
ఈ ఎన్నికలలో నిలబడటం వల్ల తాను సంపాదించుకున్నది కూడా పూర్తిగా కోల్పోయిందని వేణు స్వామి తెలిపారు. ఇలా కాకుండా తాను సైలెంట్ గా ఉండి ఉంటే కాంగ్రెస్ పాలనలో తనకు ఒక మంచి ఉద్యోగం వచ్చి ఉండేదని ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా సోషల్ మీడియానే శిరీష కెరియర్ నాశనం చేశారు అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా కామెంట్లు చేశారు.
వేణు స్వామికి తప్పని ట్రోల్స్…
ఇకపోతే ఈ మధ్యకాలంలో వేణు స్వామి కూడా తన జ్యోతిష్యం కారణంగా ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోసారి తెలంగాణకు కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని కాకుంటే నేను జ్యోతిష్యం చెప్పడమే మానేస్తానని ఈయన తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఈయన పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…