Ram Gopal Varma: పుష్ప సినిమా హిందీ కలెక్షన్లపై వర్మ ట్వీట్..! వైరల్ అవుతున్న సెటైరికల్ ట్వీట్..!
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ.. కాంట్రవర్సీకా బాప్ అంటారు ఈయనను. ఎందుకంటే.. ఈ డైరెక్టర్ ఏం చేసినా సంచలనమే. సమకాలీన అంశాల ఆధారంగా సినిమాలు తీస్తూ క్యాష్ చేసుకుంటారు. నేరాలు, ఘోరాలు, శృంగారం, రాజకీయాలు… ఇటీవల వీటిపైనే ఎక్కువ మూవీలు తీస్తుంటారు ఆర్జీవీ.
కేవలం సినిమాలే కాదు.. అప్పుడప్పుడు సామాజిక అంశాలు, రాజకీయాలపైనా తన దైన శైలిలో స్పందిస్తుంటారు ఆర్జీవీ. తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు పుష్ప సినిమాకు సంబంధించి ఆ ట్వీట్ చేశాడు. ఇటీవల పుష్ప సినిమా విడుదలై అన్ని భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ముఖ్యంగా హిందీలో ఎప్పుడూ లేనంతగా.. విపరీతంగా దూసుకుపోతోంది. బన్నీ చిత్రాలు హిందీలో డబ్ కావడంతో.. అక్కడ అతడికి ఫ్యాన్స్ పెరిగారు. దీనికి క్యాష్ చేసుకొని బన్నీ మొదటి సారిగా పాన్ ఇండియా లెవల్లో సినిమాను ప్లాన్ చేసి.. మొదటి పార్ట్ ను విడదల చేశారు. అనుకున్నట్లుగానే మంచి విజయం సాధించింది. ఇక హిందీలో మంచి విజయం సాధించడంతో..దీనిపై వర్మ ట్వీట్ చేశాడు.
బాలీవుడ్.. హాలీవుడ్ వెంట పడుతుంటే.. టాలీవుడ్ మాత్రం.. బాలీవుడ్ వెంట పడుతోంది అంటూ ట్వీట్ చేశాడు. వివరంగా చెప్పాలంటే.. స్పైడర్మాన్, పుష్ప హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ.. హాలీవుడ్ వెనుక పరుగెడుతున్న బాలీవుడ్ని, టాలీవుడ్ వెంటాడుతోందని అర్థం వచ్చేలా మెసేజ్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్పై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇక హిందీలో పుష్ప సినిమాతో పాటు.. కలెక్షన్లు కురిపిస్తున్న మరో సినిమా హాలీవుడ్ సినిమా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ . ఇది కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…