పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలామందికి రోడ్డు పక్కన ఉండే పానీపూరి తినాలని ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే సాయంత్రం సమయంలో ఎంతో ఎంజాయ్ చేస్తూ పానీ పూరి తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.చిన్న పూరీలో బఠాణీలు, ఉల్లి కట్లెట్ వేసి… నిమ్మరసంలో ముంచి ఇస్తే… నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే దాని టేస్టే చెప్పడం కన్నా తిని చూస్తేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన రుచిని కేవలం మనుషులు మాత్రమే కాకుండా ఆవులు సైతం ఎంతో ఇష్టంగా తింటున్నాయి.
ఉత్తరప్రదేశ్ , లక్నోలో, హిల్ కాన్వెంట్ స్కూల్ ఉంది. అక్కడ ఓ పానీపూరీ బండి ఉంది. ఆ పానీపూరి బండి వద్దకు ఒక ఆవు దూడ వచ్చి బండి యజమాని ఆహారం పెడతాడేమో అన్నట్టు చూస్తున్నాయి. ఈ ఆవులను గమనించిన యజమాని అందరికీ పెట్టినట్టుగానే ఆవు దూడకు ఒక్కొక్కటిగా పానీ పూరి పెడుతున్నాడు. అయితే వాటికి మనలా తినడం రాదు కనుక స్వయంగా పానీపూరి బండి యజమాని ఒక్కొక్కటి తినిపించ సాగాడు.
పానీ పూరిల రుచి బాగా ఉండడంతో ఆవులు సైతం ఒక గిన్నె మొత్తం ఖాళీ చేశాయి. అయినప్పటికీ వాటి ఆకలి తీరలేదేమో అని మరొక ప్లేట్ పూరీలు తెప్పించి వాటి ఆకలిని తీర్చాడు. ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందడంతో ఎంతోమంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి కష్ట సమయాల్లో కూడా పానీపూరి యజమాని తనకు నష్టం వాటిల్లుతుందని భావించకుండా ఆవుకు పానీపూరి పెట్టడం పట్ల నెటిజన్లు అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…