Vijay Devarakonda : ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. మొదట్లో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్న పాత్రలను చేసిన విజయ్ ఆ తరువాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ అయిపోయాడు. కానీ ఇదంతా జరగడానికి విజయ్ చాలా కష్టపడ్డాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా పూరీ దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈవెంట్ లో విజయ్ నెపోటిజం గురించి మాట్లాడారు. ఆవి జనాల్లో బాగా చర్చకు దారితీశాయి.
స్టార్ కిడ్స్ కి ఆ బాధలు ఉండవు…
మా నాన్న, తాత ఎవరో తెలియక పోయినా నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు అంటూ చేసిన వాఖ్యలు స్టార్ కిడ్స్ ను పరోక్షంగా అనడమే అనట్లుగా అనిపించింది. ఇక తాజాగా కాఫీ విత్ కరణ్ లో కూడా విజయ్ మళ్ళీ నెపోటిజం గురించి ప్రశ్నకు జవాబు ఇచ్చాడు. మన పుట్టుకను మనం నిర్ణయించం, ఇలానే పుట్టాలి, ఇంతే హైట్ ఉండాలి అన్నది మనం నిర్ణయించం, అలా స్టార్ హీరోకి వారసుడిగా పుట్టాలని కూడా మనం నిర్ణయించం అంటూ డిప్లొమాటిక్ సమాదానం చెప్పాడు. రేపు నాకు పిల్లలు పుడితే వాళ్ళు స్టార్ కిడ్స్ అవుతారు, కానీ ఎవరి జీవితంలో వాళ్ళే పోరాడాలి.
స్టార్ కిడ్ కి ఉన్న అడ్వాంటేజ్ మంచి ప్రారంభం దొరుకుతుంది. నేను పడిన కష్టాలు, అవమానాలు వారికి ఉండవు. ఆ అవమానాలు, ఒడిదుడుకులే నన్ను హీరోని చేసాయి అంటూ నేను నెపోటిజం కి వ్యతిరేకం కాదు అన్నట్లుగా పరోక్షంగా మాట్లాడారు రౌడీ బాయ్. లైగర్ సినిమా విజయం విజయ్ దేవరకొండ కెరీర్ కి కీలకం, అంతకు ముందు వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ప్లాప్ అవ్వడంతో హిట్ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ఇక లైగర్ సినిమా తరువాత విజయ్ మళ్ళీ పూరీ కాంబినేషన్ లోనే జనగణమన సినిమా చేయబోతున్నాడు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…