Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పూరి చార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలయ్యి హిందీ వెర్షన్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టినప్పటికీ మిగిలిన అన్ని భాషలలో కలిపి ఈ సినిమా దాదాపు 50 కోట్ల రూపాయల వరకు నష్టాలను చవిచూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ నష్టాలను భరించడం కోసం పూరి జగన్నాథ్ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమా లాభాలతో కలిపి ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు సినిమాలలో వచ్చిన లాభాలను హీరోకి ఇవ్వలేదని అయితే ఆ లాభాలు తనకు వద్దని చెప్పడమే కాకుండా తనకి ఇచ్చిన ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చారని తెలుస్తుంది.
ఈ విధంగా ఈ సినిమా ద్వారా భారీ నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. ఇకపోతే విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని కూడా పూరి జగన్నాథ్ చార్మిలతో కలిసి చేయాల్సి ఉంది.
పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాని కూడా విజయ్ దేవరకొండతో చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన అనంతరం ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే అందులో వచ్చే లాభాలను విజయ్ దేవరకొండ తీసుకోనున్నట్లు వెల్లడించారు.ఇలా సినిమా నష్టపోవడంతో నిర్మాతలకు విజయ్ దేవరకొండ అండగా నిలబడడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ తన తదుపరిచిత్రం ఖుషి, జనగణమన సినిమాలపై దృష్టి పెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…