Vijay Devarakonda: చెత్త వార్తలు అంటూ మీడియాపై రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ..కారణం అదేనా?
Vijay Devarakonda: తెలుగుతో పాటు కన్నడలోనూ స్టార్ హీరోయిన్గా రాణిస్తూ,బాలీవుడ్ లో కూడా లీడింగ్ స్టార్ హీరోయిన్ సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతోంది నటి రష్మిక మందన. ఇకపోతే పెళ్లి చూపులు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ తర్వాత అర్జున్ రెడ్డితో యూత్కు బాగా దగ్గరైన విజయ్.. రష్మికతో కలిసి జంటగా నటించిన గీత గోవిందం సినిమా వీరిని ఎక్కడికో తీసుకెళ్లిందని చెప్పవచ్చు. అప్పట్లో వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి అభిమానులు కథలు కథలుగా చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చి డియర్ కామ్రేడ్ అంతగా ఆడకపోయినా ఓ లెవల్లో యూత్ను ఆకట్టున్నట్టు చెప్పవచ్చు.
ఇకపోతే వీరిద్దరూ ఇంత సాన్నిహత్యంగా ఉండడం చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రూమర్స్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని పోస్ట్లు, మీమ్స్ వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాం. కానీ వీరిద్దరిలో ఏ ఒక్కరూ కూడా తామిద్దరూ ప్రేమలో ఉన్నట్టు గానీ, లేదా లేనట్టు గానీ ప్రకటించలేదు. అంతే కాకుండా విజయ్కి సంబంధించిన పర్సనల్ పార్టీలలోనూ రష్మిక ఉండడం, తన మదర్తో షాపింగ్ చేయడం లాంటివన్నీ కూడా ఆ వార్తలు నిజమనేటట్టు గానే నిరూపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన మరో వార్త వైరల్గా మారింది. విజయ్, రష్మిక తొందర్లోనే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ మరియు కొన్ని వార్తా వెబ్సెట్లు ప్రకటించాయి. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే విజయ్ దేవరకొండ ఇలాంటి వార్తలు వ్యాపింపజేసే వారికి తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. తనపై వచ్చే వార్తలపై అగ్రెసివ్గా రియాక్టవడం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వారిద్దరి పెళ్లిపై ఇప్పటి వరకూ స్పందించని విజయ్ మాత్రం తొలిసారిగా స్పందించి, బూతు పురాణం మొదలెట్టారు. ఎప్పటిలాగే తనపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు అన్నీ నాన్సెన్స్ అని తిడుతూ, ఓ బూతు పదాన్ని జత చేస్తూ విజయ్ ట్వీట్ చేశారు. ఇలా తనపై వార్తలన్నీ అసత్యాలని తనకు నచ్చిన స్టైల్లో సమాధానమిచ్చారు విజయ్.
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…