మన జీవితంలో అదృష్టం, దురదృష్టం ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి తలుపు తడతాయో ఎవరికీ తెలియదు.ఇలా అదృష్టం మన ఇంటి తలుపు తట్టినప్పుడు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు.అదే దురదృష్టం వెంటాడుతుంటే ఎంతో పెద్ద కోటీశ్వరులు కూడా రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో ఒకటి చోటు చేసుకుంది. కుమారుడి చదువు కోసం ఉన్న భూమిని కాస్త అమ్మి డబ్బులు తెచ్చి ఇంట్లో పెడితే ఆ డబ్బు కాస్త అగ్నికి ఆహుతి అయిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ , పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే…చింతలపూడి మండలం గురుభట్లగ్రామం గ్రామంలోని శివాలయం వీధిలో నివసిస్తుండే కృష్ణవేణి అనే మహిళ తనకు ఉన్న పొలం అమ్మి తన కొడుకు ఉన్నత చదువుల కోసం డబ్బును సమకూర్చుకుంది. ఈ క్రమంలోనే 20 లక్షల నగదును బ్యాగులో పెట్టి డబ్బులు బీరువాలో భద్రపరిచింది. అసలు డబ్బు కాలి పోవడానికి ఏ మాత్రం అవకాశం లేనిచోట దాచిపెట్టిన ఆ డబ్బు పై ప్రకృతి కన్నెర్ర చేసింది.
ఇలా బీరువాలో దాచిపెట్టిన సొమ్ము పై ఏకంగా పిడుగు పడటం చేత అందులో ఉన్నటువంటి 20 లక్షలు కళ్ళముందే అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఇదంతా చూస్తున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇలా కుమారుడు ఉన్నత చదువుల కోసం ఉన్న పొలంకాస్త అమ్మి వచ్చిన డబ్బులు ఇలా బూడిద కావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటన జరగగానే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇలా ఉన్న సొమ్ము మొత్తం బూడిదలో కాలిపోవడంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఇలాంటి కష్ట సమయాల్లో వారిని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…