టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అయినా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా నిర్మాణ పనులను జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ టెంపుల్ టౌన్ సృష్టించాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా లేని అతిపెద్ద టెంపుల్ టౌన్ ఆచార్య సినిమాలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో వేశారు. అయితే ఈ టెంపుల్ టౌన్ గాలి గోపురానికి సంబంధించిన వీడియోను హీరో చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ గా 20 ఎకరాల విస్తీర్ణంలో వేశారు. ప్రతి చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో అద్భుతంగా మలిచి గాలి గోపురాన్ని క్రియేట్ చేశారు. ఈ విధంగా క్రియేట్ చేయడం కళా దర్శకత్వం ప్రతిభకే ఓ మచ్చుతునక. నాకెంతో ముచ్చట అనిపించి ఈ గాలి గోపురాన్ని నా కెమెరాలో బంధించి.. మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజంగానే ఓ టెంపుల్ టౌన్ లో ఉన్నామా? అనేంతగా ఈ టెంపుల్ ను డిజైన్ చేసిన కళాదర్శకుడు సురేష్ ను, టెంపుల్ టౌన్ ను విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివను, ఈ టెంపుల్ టౌన్ నిర్మించడానికి కావలసినవి సమకూర్చిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చిరంజీవి ఈ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.
కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో మెగా వారసుడు రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు మనకు తెలిసిందే. ఆచార్య సినిమాలో ప్రముఖ బాలీవుడ్ ప్రతి నాయకుడు అయిన సోనుసూద్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తొందరలోనే షూటింగ్ పూర్తిచేసుకుని ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…