కరోనా రెండవ దశ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఈసారి కూడా తప్పదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కేసులు భారీ సంఖ్యలో పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలలో లాక్ డౌన్ అమలు చేయడం ఎంతో శ్రేయస్కరం అని భావిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా కరోనా కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధించారు.
ఈ క్రమంలోనే మరోసారి లాక్ డౌన్ విధిస్తే తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే గ్రహించిన వలస కూలీలు పెద్ద ఎత్తున సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. ఒకప్పుడు గ్రీన్ జోన్లుగా ఉండే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ప్రస్తుతం అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు జిల్లాలలో లాక్ డౌన్ విధించాలని అధికారులు అడుగులు వేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులలో లాక్ డౌన్ విధించాల లేదా అనే అంశంపై అక్కడి ప్రజలను ప్రశ్నిస్తే అందుకు వారు లాక్ డౌన్ విధించాలనే చెబుతున్నారు. 14 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తే ఈ మహమ్మారిని కొంత వరకు కట్టడి చేయవచ్చని అక్కడి ప్రజల ఉద్దేశం. ఈ క్రమంలోనే రెండు వారాలకు సరిపడానిత్యావసర వస్తువులను తాము ముందుగానే సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ రెండు జిల్లాలలో కంటెంట్మెంట్ జోన్లను విధించగా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా యువత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఇటువంటి సమయంలోనే లాక్ డౌన్ అమలు చేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై గతంలో మాదిరిగా శిక్షించాలని, ప్రాణం కన్నా లాక్ డౌన్ మిన్న అంటూ అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…