దుబాయ్, సౌదీ, ఒమన్ లాంటి గల్ఫ్ దేశాల్లో బోర్ వేస్తే నీటికి బదులు పెట్రోల్, చమురు ఉబికి వస్తుంది. అక్కడ ఎక్కువగా చమురు నిక్షేపాలు ఉండడంతో పెట్రోల్ ను బోర్లతో తవ్వితీసి అమ్ముకుంటున్నారు. కానీ వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో బోర్ వేస్తే నీళ్లు రావడం లేదు.. ఏకంగా వాటి బదులు పెట్రోల్ వస్తోంది. ఈ విచిత్రం చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగర నడిబొడ్డున గోపాలపట్నం రామకృష్ణనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ బోర్ వేయగా వాటర్ తో పాటు పెట్రోల్ కలుస్తోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. సొంత బోర్లు వేసినప్పటికీ అందులోంచి పెట్రోల్ వాటర్ తో పాటు పెట్రోల్ వస్తోంది. దీంతో మున్సిపల్ సరఫరా చేసే నీరే వీరికి దిక్కవుతోంది. ఇక్కడి పక్కనే ఉండే భారత్ పెట్రోల్ బంక్ వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని కాలనీ వాసులు అంటున్నారు.
దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆర్కేనగర్ వాసులు వాపోతున్నారు. విశాఖపట్నం 91వ వార్డు రామకృష్ణనగర్ తోపాటు పక్క ప్రాంతాలు కూడా ఇలాంటి నీటితోనే ప్రజలు చాలా ఇబ్బందుకు గురవుతున్నారు. ఈ ప్రాంత వాసులకే ఈ సమస్య ఉత్పన్న అవుంతోంది. బోర్ నుంచి వచ్చే నీళ్లలో పెట్రోల్ కలుషితం అవుతోందని కాలనీవాసులు అంటున్నారు. భారత్ పెట్రోల్ బంక్ ట్యాంకు పగిలి అందులోంచి పెట్రోల్, డీజీల్ నాలుగేళ్ల క్రితం భూగర్భంలోకి లీక్ అయ్యింది.
గ్రౌండ్ లెవల్ మొత్తం కలుషితమైంది. దీంతో దీని పక్కన ఉన్న కాలనీలో ఏ ప్రాంతంలో బోర్ వేసినా నీళ్లలో పెట్రోల్ వస్తోంది. దీంతో ఆ నీటికి కాలనీ వాసులు వాడలేక పోతున్నారు. ఇక మున్సిపల్ సరఫరా చేసే నీరు సరిపోవడం లేదని.. ఇక్కడ బోర్ నీళ్లు వాడక ఇబ్బందులు పడుతున్నారు . దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…