దుబాయ్, సౌదీ, ఒమన్ లాంటి గల్ఫ్ దేశాల్లో బోర్ వేస్తే నీటికి బదులు పెట్రోల్, చమురు ఉబికి వస్తుంది. అక్కడ ఎక్కువగా చమురు నిక్షేపాలు ఉండడంతో పెట్రోల్ ను బోర్లతో తవ్వితీసి అమ్ముకుంటున్నారు. కానీ వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో బోర్ వేస్తే నీళ్లు రావడం లేదు.. ఏకంగా వాటి బదులు పెట్రోల్ వస్తోంది. ఈ విచిత్రం చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగర నడిబొడ్డున గోపాలపట్నం రామకృష్ణనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ బోర్ వేయగా వాటర్ తో పాటు పెట్రోల్ కలుస్తోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. సొంత బోర్లు వేసినప్పటికీ అందులోంచి పెట్రోల్ వాటర్ తో పాటు పెట్రోల్ వస్తోంది. దీంతో మున్సిపల్ సరఫరా చేసే నీరే వీరికి దిక్కవుతోంది. ఇక్కడి పక్కనే ఉండే భారత్ పెట్రోల్ బంక్ వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని కాలనీ వాసులు అంటున్నారు.
దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆర్కేనగర్ వాసులు వాపోతున్నారు. విశాఖపట్నం 91వ వార్డు రామకృష్ణనగర్ తోపాటు పక్క ప్రాంతాలు కూడా ఇలాంటి నీటితోనే ప్రజలు చాలా ఇబ్బందుకు గురవుతున్నారు. ఈ ప్రాంత వాసులకే ఈ సమస్య ఉత్పన్న అవుంతోంది. బోర్ నుంచి వచ్చే నీళ్లలో పెట్రోల్ కలుషితం అవుతోందని కాలనీవాసులు అంటున్నారు. భారత్ పెట్రోల్ బంక్ ట్యాంకు పగిలి అందులోంచి పెట్రోల్, డీజీల్ నాలుగేళ్ల క్రితం భూగర్భంలోకి లీక్ అయ్యింది.
గ్రౌండ్ లెవల్ మొత్తం కలుషితమైంది. దీంతో దీని పక్కన ఉన్న కాలనీలో ఏ ప్రాంతంలో బోర్ వేసినా నీళ్లలో పెట్రోల్ వస్తోంది. దీంతో ఆ నీటికి కాలనీ వాసులు వాడలేక పోతున్నారు. ఇక మున్సిపల్ సరఫరా చేసే నీరు సరిపోవడం లేదని.. ఇక్కడ బోర్ నీళ్లు వాడక ఇబ్బందులు పడుతున్నారు . దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…