విమానం ఎక్కాలనే ఆశ అందరికీ ఉంటుంది. అయితే ఫ్రీగా విమానంలో పోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఆశ కలుగుతుంది. అయితే ప్రస్తుతం విస్తారా ఎయిర్లైన్స్ వారు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే ఉచితంగా విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆఫర్ ప్రతి ఒక్కరికి కాదండోయ్.. కేవలం డాక్టర్లు, నర్సులకు మాత్రమే ఉచితంగా ప్రయాణించే ఆఫర్ ను కల్పించింది.
ఈ నేపథ్యంలోనే ఆదివారం విస్తారా ఎయిర్లైన్స్ ఈ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా ప్రభుత్వ సంస్థలలో పనిచేసే డాక్టర్లు నర్సులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకే విస్తారా ఎయిర్లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి ఉత్తరం రాసింది. ఈ విమాన సేవల ద్వారా ప్రభుత్వ సంస్థలకు, హాస్పిటల్స్ కు తక్షణ సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే వారికి ముందు సీట్లు కేటాయింపు ఉంటుందని ఎయిర్లైన్స్ తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందించాల్సిన విషయం.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…