విమానం ఎక్కాలనే ఆశ అందరికీ ఉంటుంది. అయితే ఫ్రీగా విమానంలో పోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఆశ కలుగుతుంది. అయితే ప్రస్తుతం విస్తారా ఎయిర్లైన్స్ వారు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే ఉచితంగా విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆఫర్ ప్రతి ఒక్కరికి కాదండోయ్.. కేవలం డాక్టర్లు, నర్సులకు మాత్రమే ఉచితంగా ప్రయాణించే ఆఫర్ ను కల్పించింది.

ఈ నేపథ్యంలోనే ఆదివారం విస్తారా ఎయిర్లైన్స్ ఈ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా ప్రభుత్వ సంస్థలలో పనిచేసే డాక్టర్లు నర్సులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకే విస్తారా ఎయిర్లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి ఉత్తరం రాసింది. ఈ విమాన సేవల ద్వారా ప్రభుత్వ సంస్థలకు, హాస్పిటల్స్ కు తక్షణ సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే వారికి ముందు సీట్లు కేటాయింపు ఉంటుందని ఎయిర్లైన్స్ తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందించాల్సిన విషయం.

































