Featured

ఈ విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకుంటే కరోనా ముప్పు తప్పినట్టే…?

దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా 90 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజలు రోడ్లపై అడుగు పెట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయి. ఎక్కడ, ఎలా ఎవరి నుంచి ఈ వైరస్ సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పైనే కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఎవరైతే విటమిన్ సి, విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడతారో వారు కరోనా బారిన పడే అవకాశాలు దాదాపు ఉండవని వైరాలజిస్ట్ లు సూచిస్తున్నారు. సి, డి విటమిన్ ట్యాబ్లెట్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచి వైరస్ బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు.

అయితే వైద్యుల సూచనల మేరకు మాత్రమే విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకోవాలని ట్యాబ్లెట్లను ఎలా పడితే అలా తీసుకున్నా ప్రమాదమేనని చెబుతున్నారు. అమెరికా ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ ఫాసీ ప్రజలకు ఈ సూచనలు చేశారు. ఎవరైతే విటమిన్ల లోపంతో బాధ పడుతూ ఉంటారో వారు త్వరగా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుందని….. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ట్యాబ్లెట్లను వాడినా ఫలితం ఉండదదని తెలుపుతున్నారు.

మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని… అవసరానికి తగిన విధంగా డి విటమిన్ ఉండేలా చూసుకుని మంచి యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ సి ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. గతంలో పలు అధ్యయనాల్లో విటమిన్ డి లోపంతో బాధ పడే వారే ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని తేలింది. అయితే డాక్టర్ ఫౌసీ మాత్రం విటమిన్ డి తో పాటు విటమిన్ సి ని కూడా తీసుకోవాలని చెబుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డబ్బు కలలు వస్తున్నాయా? మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది!

నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…

17 seconds ago

పరశురామ ద్వాదశి ప్రత్యేకత ఏమిటి?.. భక్తులు ఎందుకు చేస్తారు?

హిందూ పంచాంగంలో ప్రతి పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో వైశాఖ మాసంలో వచ్చే పరశురామ ద్వాదశి కూడా…

9 minutes ago

కెరీర్ గ్రోత్ ఆగిపోయిందా?.. ఇంట్లో ఈ వాస్తు మార్పులు ట్రై చేయండి!

ఇప్పటి పోటీ ప్రపంచంలో కెరీర్‌లో ఎదగడం అనేది చాలామందికి పెద్ద సవాలుగా మారింది. మంచి విద్య, కష్టపడే స్వభావం ఉన్నా…

20 minutes ago

జపమాలను పంచుకుంటే దైవ అనుగ్రహం తగ్గుతుందా? జపసాధనలో మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే కావచ్చు!

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో మంత్రజపానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఏకాగ్రత పెంచుకోవడం, దైవానుభూతిని పొందడం వంటి…

35 minutes ago

వినడానికి వింతగా ఉన్నా నిజమే!.. అమ్మవారికి రొయ్యల నైవేద్యం!

భారతదేశంలో ఆలయ సంప్రదాయాలు ప్రాంతానికో, దేవతానికో ప్రత్యేకంగా ఉండటం సహజమే. కొన్ని చోట్ల సాధారణ పూజలు కనిపిస్తే, మరికొన్ని దేవాలయాల్లో…

43 minutes ago

హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రాకపోవడానికి అసలు కారణాలు ఇవే!

ఆసుపత్రి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) చాలా కుటుంబాలకు ఆర్థిక భరోసాగా మారింది.…

49 minutes ago