దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా 90 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజలు రోడ్లపై అడుగు పెట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయి. ఎక్కడ, ఎలా ఎవరి నుంచి ఈ వైరస్ సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పైనే కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఎవరైతే విటమిన్ సి, విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడతారో వారు కరోనా బారిన పడే అవకాశాలు దాదాపు ఉండవని వైరాలజిస్ట్ లు సూచిస్తున్నారు. సి, డి విటమిన్ ట్యాబ్లెట్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచి వైరస్ బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు.

అయితే వైద్యుల సూచనల మేరకు మాత్రమే విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకోవాలని ట్యాబ్లెట్లను ఎలా పడితే అలా తీసుకున్నా ప్రమాదమేనని చెబుతున్నారు. అమెరికా ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ ఫాసీ ప్రజలకు ఈ సూచనలు చేశారు. ఎవరైతే విటమిన్ల లోపంతో బాధ పడుతూ ఉంటారో వారు త్వరగా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుందని….. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ట్యాబ్లెట్లను వాడినా ఫలితం ఉండదదని తెలుపుతున్నారు.

మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని… అవసరానికి తగిన విధంగా డి విటమిన్ ఉండేలా చూసుకుని మంచి యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ సి ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. గతంలో పలు అధ్యయనాల్లో విటమిన్ డి లోపంతో బాధ పడే వారే ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని తేలింది. అయితే డాక్టర్ ఫౌసీ మాత్రం విటమిన్ డి తో పాటు విటమిన్ సి ని కూడా తీసుకోవాలని చెబుతున్నారు.































