అసలే కరోనా తో అల్లకల్లోలం అవుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కష్టమొచ్చిపడింది. వైజాగ్ పరిసరాలైన గోపాలపట్నం, ఆర్ ఆర్ వెంకటాపురం ప్రాంతాలలో ఎల్జీ పాల్జిమర్స్ అనే ఫ్యాక్టరీ నుంచి వెలువడిన స్టెరీన్ వాయువు కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందర్ని విశాఖ కెజిహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో పక్షులు, మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. కాగా ఈ వాయువు పీల్చిన వారిపై ఈ స్టెరీడ్ ప్రభావం దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఈ వాయువు పీల్చడం వలన కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని, దానితో కిడ్నీ సంబంధిత వ్యాధులు, తలనొప్పి, మానసిక రుగ్మత, అలసట, నీరసం, వినికిడి లోపం, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై దేశవ్యాప్తంగా పలువురు స్పందిస్తున్నారు. ప్రధాన మంత్రి మోడీ బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేసారు. అదే సమయంలో వారికి సరైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసారు. దీనితోపాటుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ మంత్రి కేటీఆర్, కల్వకుంట్ల కవిత, టాలీవుడ్ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తదితరులు సోషల్ మీడియాలో తమ సంఘీభావం తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…