ఈ ఆధునిక కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అధిక బరువు సమస్య ఇప్పుడు ఎక్కువగా అందరిని వేధిస్తోంది. మనం తీసుకునే ఆహారంలో మార్పులు రావడం వల్ల అధిక బరువు సమస్య ఎక్కువ అవుతోంది. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినటం ఇందుకు కారణం.
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులు ఫాస్ట్ ఫుడ్స్ ,జంక్ ఫుడ్ తినటానికి మొగ్గుచూపుతున్నారు. వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు స్థూలకాయం సమస్య వేధిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం చాలామంది జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేయడం, డైట్ ను ఫాలో అవ్వడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు మనం అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని సులభమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం.
ఉరుకులు పరుగుల జీవితంలో డబ్బు సంపాదనలో పడి సమయానికి తినకుండా రాత్రి ఎప్పుడో 10, 11 గంటలకి భోజనం చేయడం అలవాటుగా మారిపోయింది.అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట అన్నం తినకుండా చపాతీలు పండ్లు వంటివి తీసుకుంటారు. అయితే మీరు పాటిస్తున్న పద్ధతి సరైనదేనా ఆహారం వెంటనే నిద్ర పోకూడదు . అలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల ఆహారం తిన్న తర్వాత ఒక అర గంట సేపు వాకింగ్ చేయడం మంచిది. ద్వారా బరువు సమస్య పెరగకుండా ఉంటుంది.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు రాత్రివేళ భోజనంలో పిండి పదార్థాలు తీసుకోవడానికి బదులు సలాడ్, సూపర్, పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మాత్రమే లభిస్తాయి.
రాత్రివేళ నిద్రపోయే ముందు భోజనానికి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగటం బల్ల అధిక బరువు సమస్యను నిర్మూలించవచ్చు. పాలలో అనేక రకాల పోషక విలువలు దాగి ఉంటాయి. అందువల్ల రాత్రివేళ భోజనం చేయడానికి బదులు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి కావలసిన శక్తి లభించే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
చాలామందికి రాత్రివేళ భోజనం చేసే సమయంలో స్నాక్స్ తినటం అలవాటుగా ఉంటుంది. అలా చేయటం చాలా ప్రమాదం. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు ఇంకా పేరుకుపోయి సమస్య తీవ్రత పెరుగుతుంది. కావున ఈ సమస్యతో బాధపడే వారు రాత్రివేళ నిద్రపోయే ముందు ఇటువంటి పొరపాట్లు చేయకపోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…