ఈ ఆధునిక కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అధిక బరువు సమస్య ఇప్పుడు ఎక్కువగా అందరిని వేధిస్తోంది. మనం తీసుకునే ఆహారంలో మార్పులు రావడం వల్ల అధిక బరువు సమస్య ఎక్కువ అవుతోంది. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినటం ఇందుకు కారణం.
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులు ఫాస్ట్ ఫుడ్స్ ,జంక్ ఫుడ్ తినటానికి మొగ్గుచూపుతున్నారు. వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు స్థూలకాయం సమస్య వేధిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం చాలామంది జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేయడం, డైట్ ను ఫాలో అవ్వడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు మనం అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని సులభమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం.
ఉరుకులు పరుగుల జీవితంలో డబ్బు సంపాదనలో పడి సమయానికి తినకుండా రాత్రి ఎప్పుడో 10, 11 గంటలకి భోజనం చేయడం అలవాటుగా మారిపోయింది.అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట అన్నం తినకుండా చపాతీలు పండ్లు వంటివి తీసుకుంటారు. అయితే మీరు పాటిస్తున్న పద్ధతి సరైనదేనా ఆహారం వెంటనే నిద్ర పోకూడదు . అలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల ఆహారం తిన్న తర్వాత ఒక అర గంట సేపు వాకింగ్ చేయడం మంచిది. ద్వారా బరువు సమస్య పెరగకుండా ఉంటుంది.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు రాత్రివేళ భోజనంలో పిండి పదార్థాలు తీసుకోవడానికి బదులు సలాడ్, సూపర్, పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మాత్రమే లభిస్తాయి.
రాత్రివేళ నిద్రపోయే ముందు భోజనానికి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగటం బల్ల అధిక బరువు సమస్యను నిర్మూలించవచ్చు. పాలలో అనేక రకాల పోషక విలువలు దాగి ఉంటాయి. అందువల్ల రాత్రివేళ భోజనం చేయడానికి బదులు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి కావలసిన శక్తి లభించే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
చాలామందికి రాత్రివేళ భోజనం చేసే సమయంలో స్నాక్స్ తినటం అలవాటుగా ఉంటుంది. అలా చేయటం చాలా ప్రమాదం. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు ఇంకా పేరుకుపోయి సమస్య తీవ్రత పెరుగుతుంది. కావున ఈ సమస్యతో బాధపడే వారు రాత్రివేళ నిద్రపోయే ముందు ఇటువంటి పొరపాట్లు చేయకపోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…