ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారానికి తగ్గట్టుగా శారీరక శ్రమ చేయకపోవటం వల్ల మన శరీర బరువు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే అధిక శరీర బరువు ఊబకాయానికి దారి తీయడమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుంది.ఈ క్రమంలోనే చాలా మంది వారి శరీర బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కఠిన ఆహార నియమాలను పాటించడం, అధిక శారీరక వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు.అయితే ఈ విధంగా శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఈ రాత్రి ఏడు గంటల తర్వాత ఈ పనులను చేయడం మానేస్తే తొందరగా శరీర బరువు తగ్గించుకోవచ్చు చెబుతున్నారు. మరి ఆ పని ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాయంత్రం ఏడు గంటల తరువాత మనం తీసుకునే ఆహారం మన శరీరానికి శక్తిని ప్రసారం చేయదు. కనుక 7 గంటలలోపు తగినంత ఆహారాన్ని తీసుకోవాలి. ఏడు గంటల తరువాత తిన్న ఆహారం మన శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం వల్ల శరీర బరువు పెరుగుతారు.రాత్రి సమయంలో భోజనం చేసేటప్పుడు ఎక్కువగా కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు, పిండిపదార్ధాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కువగా పండ్లను మాత్రమే తీసుకోవాలి.
చాలామందికి రాత్రి పడుకునే ముందు కూడా కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. వీలైనంత వరకు ఈ అలవాటును మార్చుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు శారీరక వ్యాయామాలు చేయకూడదు. ఇలా చేయటం వల్ల మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే పరిస్థితి ఉంటుంది.
ప్రతి రోజూ ఎక్కువ మొత్తంలో నీరు తాగడం ఎంతో ఆరోగ్యకరం.అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు కానీ, రాత్రి పడుకునే ముందు అధిక మొత్తంలో నీటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అధిక మొత్తంలో నీటిని తీసుకున్న మనం తిన్న ఆహారం జీర్ణం కాక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మన ఆరోగ్యం మన నిద్రపై ఆధారపడి ఉంటుంది. రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు నిద్ర పోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. రాత్రి ఏడు గంటల తర్వాత పై తెలిపిన పనులను చేయడం మానేస్తే శరీర బరువును సులభంగా తగ్గవచ్చు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…