Categories: FeaturedGeneral News

కరోనా వైరస్ బారిన పడిన రోగులను 24 గంటల్లో క్యూర్ చేస్తానని ఛాలెంజ్ చేస్తూ.. సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ !

కోవిడ్ 19 వైరస్ బారినపడి రోజుకు కొన్ని వేలమంది చనిపోతున్న కధనాలను చదివి జనం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భీతిల్లుతున్నారు. కరోనాను నివారించే మందు కోసం ప్రజలందరూ ఆశగా ఎదురుచూస్తున్న ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ వి. ఎస్.రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

హోమియో వైద్యం మరియు జర్మన్ న్యూ ప్రివెంటివ్ మెడిసిన్ కరోనాని నివారించేలా ఉందని అంతేగాక కరోనా పాజిటివ్ వచ్చిన రోగిని మ్యాక్సిమమ్ 24 గంటల్లో క్యూర్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈమధ్య మీడియా తో ఇంటర్వ్యూ ఇచ్చిన డాక్టర్ వి.ఎస్ రెడ్డి ఈ కరోనా వైరస్ కి మందు తాను కనిపెట్టానని, హోమియోపతి వైద్యంలో గత పాతికేళ్ళుగా అనుభవం ఉన్న ఆస్పత్రిగా తమ హాస్పిటల్ కి మంచి పేరు ఉందని, ఈ మందు అన్ని రకాల జ్వరాలకు పని చేస్తుందని, ఈ మందును వాడితే కరోనా వైరస్ బారిన పడిన రోగులు 24 గంటల నుంచి 14రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని, తాను తమ బృందంతో కలిసి ఈ మందును స్వయంగా తయారు చేశానని, కార్పొరేట్ సంస్ధలు చేయలేని పనిని తాము చేస్తున్నామని‌, హోమియో మరియు జర్మన్ న్యూ మెడిసిన్ ద్వారా కరోనాకు ప్రివెంటివ్ మెడిసిన్ ఉందనీ మరియు కరోనా పాజిటివ్ వచ్చిన రోగిని మ్యాక్సిమమ్ 24 గంటల్లో క్యూర్ చేస్తానని ఘంటా పథంగా చాలెంజ్ చేస్తున్నారు.

హాస్పిటల్లో పేషెంట్లు గానీ, సిబ్బంది కానీ, తన కుమారుడు కూడా మాస్క్, సానిటైజర్ గానీ గత 120 రోజులుగా వాడలేదనీ ఈ సందర్భంగా చెప్పడం విశేషం. హాస్పిటల్ గుమ్మం ముందు ప్రతీరోజూ ఒక లిక్విడ్ చల్లుతామనీ దాని వలన ఎంత మంది కరోనా పాజిటివ్ రోగులు ప్రవేశించినా వైరస్ లోపలికి రాదని, ప్రాణాపాయ స్థితిలో, కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న కరోనా పేషెంట్లను కూడా తను ట్రీట్ చేసి 12 గంటల్లో డిశ్ఛార్జి చేయించానని ధీమాగా చెబుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారేనని, ఆయనకు ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తే, వారి స్టాఫులో ఇద్దరికి తప్ప 16 మంది ఆరోగ్యంగా ఉన్నారని ఆ ఇద్దరూ తన మెడిసిన్ వాడకపోవడం వలనే కరోనా వైరస్ బారిన పడ్డారని, తన మందుల గురించి ఎవరైనా పరిశోధించుకోవచ్చని ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇక్కడ పని చేసే స్టాఫ్ కూడా ఇంత వరకు కనీసం సానిటైసర్, మాస్క్ కూడా దరించకుండా డ్యూటీలు చేస్తున్నామని, చెబుతుండటం మరో ట్విస్ట్. ఇక్కడిచ్చే హోమియో మందులు కరోనా వైరస్ కి విరుగుడుగా పని చేస్తాయని ప్రభుత్వం సపోర్ట్ చేస్తే అందరికీ ఈ మెడిసిన్ ఉపయోగించవచ్చని.. ఇలాంటి విపత్కార సమయంలో రోగులకు కూడి ఇక్కడ ట్రీట్మెంట్ చేయవచ్చునంటున్నారు.

కరోనా పాజిటివ్ రావడంతో తమ కుటుంబ సభ్యుడ్ని చాలా హాస్పిటల్స్ తిప్పి తిప్పి డబ్బులు ఖర్చు చేశాం తప్ప జబ్బు నయం కాలేదని, చివరగా డా. వి.ఎస్. రెడ్డి దగ్గరకి తీసుకువచ్చి హోమియో మందులు వాడిన వారం రోజుల్లోనే కరోనా నెగెటివ్ వచ్చిందని కరోనా రోగి బంధువు ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తానికి ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తూ కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో.. వ్యాక్సిన్ కోసం దేశ దేశాలు ఆవస్ధలు పడుతున్న నేపధ్యంలో వరంగల్ హోమియో డాక్టర్ వి. ఎన్. రెడ్డి గా మెడిసిన్ వార్త స్ధానిక ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మందు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్ వి. ఎన్. రెడ్డి మీడియాకు తెలియ జేశారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago