ప్రస్తుతం భారత దేశం రెండవ దశ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే దేశ ప్రజలందరూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ మెలగటంతో మూడవ దశను అరికట్టవచ్చని ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. దేశం రెండవ దశ నుంచి కోలుకున్నప్పటికీ పూర్తిగా ఇమ్యూనిటీ పొందలేదని తద్వారా రాబోయే రోజులలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా దేశ ప్రజలకు హెచ్చరించారు.
ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు థర్డ్ వేవ్ దిశగా వెళుతున్నాయి. ముఖ్యంగా ఇండోనేషియా మలేషియా బంగ్లాదేశ్ వంటి దేశాలలో థర్డ్ వేవ్ కొనసాగుతోందని ఈ క్రమంలోనే భారత దేశ ప్రజలందరూ అప్రమత్తం కావాలని సూచించింది. కరోనా వైరస్ వివిధ వేరియంట్లో రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది.ఈ క్రమంలోనే ఈ వైరస్ ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ..వ్యాక్సింగ్ వేయించుకున్న అప్పుడే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రస్తుతం మనదేశంలో పరిస్థితి అదుపులో ఉంది అయితే ఇవే జాగ్రత్తలను కఠిన నియమాలను పాటించడంతో కొంతవరకు థర్డ్ వేవ్ తీవ్రత లేకుండా కాపాడుకోవచ్చు. ఈ క్రమంలోనే వచ్చే 100 నుంచి 125 రోజులు ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.అని వీకే పాల్ స్పష్టం చేశారు. దేశంలో ఈ మహమ్మారిని అరికట్టడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. థర్డ్ వేవ్ మన దేశంలోకి ఎంటర్ అయ్యేలోపు వ్యాక్సిన్ రూపంలో ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచుకోవాలని నీతి అయోగ్ సభ్యుడు సూచించారు
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…