ప్రస్తుతం భారత దేశం రెండవ దశ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే దేశ ప్రజలందరూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ మెలగటంతో మూడవ దశను అరికట్టవచ్చని ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. దేశం రెండవ దశ నుంచి కోలుకున్నప్పటికీ పూర్తిగా ఇమ్యూనిటీ పొందలేదని తద్వారా రాబోయే రోజులలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా దేశ ప్రజలకు హెచ్చరించారు.
ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు థర్డ్ వేవ్ దిశగా వెళుతున్నాయి. ముఖ్యంగా ఇండోనేషియా మలేషియా బంగ్లాదేశ్ వంటి దేశాలలో థర్డ్ వేవ్ కొనసాగుతోందని ఈ క్రమంలోనే భారత దేశ ప్రజలందరూ అప్రమత్తం కావాలని సూచించింది. కరోనా వైరస్ వివిధ వేరియంట్లో రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది.ఈ క్రమంలోనే ఈ వైరస్ ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ..వ్యాక్సింగ్ వేయించుకున్న అప్పుడే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రస్తుతం మనదేశంలో పరిస్థితి అదుపులో ఉంది అయితే ఇవే జాగ్రత్తలను కఠిన నియమాలను పాటించడంతో కొంతవరకు థర్డ్ వేవ్ తీవ్రత లేకుండా కాపాడుకోవచ్చు. ఈ క్రమంలోనే వచ్చే 100 నుంచి 125 రోజులు ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.అని వీకే పాల్ స్పష్టం చేశారు. దేశంలో ఈ మహమ్మారిని అరికట్టడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. థర్డ్ వేవ్ మన దేశంలోకి ఎంటర్ అయ్యేలోపు వ్యాక్సిన్ రూపంలో ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచుకోవాలని నీతి అయోగ్ సభ్యుడు సూచించారు
సీనియర్ నటుడు Nassar తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్…
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉన్న శ్రీ కామాఖ్య లలితా శ్యామల వారాహి శక్తిపీఠం భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక…
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో సినీ వర్గాల్లో చర్చకు కారణమయ్యారు. సినిమాలకు కొంత విరామం…
వేసవి కాలంలో జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు చాలామందిని వేధిస్తాయి. వేడి కారణంగా జీర్ణక్రియ మందగించడం, తినే…
తిరుమలలో భక్తులకు ముఖ్య సమాచారం వెలువడింది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే అర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తిరుమల…
తలస్నానం తర్వాత జుట్టును తుడిచేందుకు టవల్తో బిగిగా చుట్టుకోవడం చాలా మందికి సాధారణ అలవాటు. ఇది జుట్టు త్వరగా ఆరిపోతుందనే…