Jeevitha Rajashekar: మేము ఎలాంటి తప్పు చేయలేదు… ఆరోపణలపై స్పందించిన జీవిత రాజశేఖర్!
Jeevitha Rajashekar: సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా నిర్మాణంలో భాగంగా తమ దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలను తీసుకొని తిరిగి ఇవ్వలేదంటూ నగరి కోర్టులో జీవిత రాజశేఖర్ పై జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నగరి కోర్టు జీవిత రాజశేఖర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
ఇక నిన్నటి నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయంపై జీవిత-రాజశేఖర్ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో భాగంగా జీవితం మాట్లాడుతూ మేము ఎలాంటి తప్పు చేయలేదని మాపై వచ్చే ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు.
కోర్టు తీర్పు తర్వాత సాక్షాలతో సహా అన్ని విషయాలు బయట పెడతాను. మా పై ఆరోపణలు చేసిన వారు చాలా తప్పు చేశారు. నేను ఎన్నో మంచి పనులు చేసిన చాలా మందికి నచ్చదు అయితే. జీవితంలో మంచి చెడు అనేవి స్నేహంగా ఉంటాయి. అయితే మనిషిని చూసి మంచి చెడు అని నిర్ణయించలేమని జీవిత వెల్లడించారు.
ఇక చెక్ బౌన్స్ విషయంలో నేను తప్పు చేసి ఉంటే ఎప్పడో ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోయేదాన్ని. కానీ నేను మీ అందరి ముందే మీ మధ్యనే తిరుగుతున్నాను.మీ అందరిని నేను ఒకటే వేడుకుంటున్నాను అసలు విషయం ఏంటో తెలియకుండా మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన థంబ్ నైల్ పెట్టేయకండి. మేము దుర్మార్గులము అయితే గత 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగలేము.అలాగే పోలీసులు కోర్టులు కూడా చూస్తూ ఊరుకోరు అంటూ జీవిత రాజశేఖర్ తన గురించి వచ్చిన ఆరోపణలపై ఘాటుగా విమర్శించారు. కోర్టు ప్రోటోకాల్ ప్రకారం ఈ విషయం గురించి ఇంతకన్నా ఏమీ మాట్లాడలేననీ జీవితం తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…