Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా ఎంతో మంచి హృదయం కలవాడని నిరూపించుకున్నారు. మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్న విషయాన్ని తాజాగా బాలయ్య టాక్ షో ద్వారా బయట పెట్టారు.
మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉన్నారని ఆరు వారాల ముందు పుట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అయితే మాకు డబ్బు ఉంది మేం బతికించుకున్నాం.. డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి అని ఆలోచన వచ్చిందని అప్పటి నుంచి చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించడం మొదలు పెట్టామని తెలిపారు.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏకంగా వెయ్యి మందికి పైగా చిన్న పిల్లలకు ఆపరేషన్ చేయించారు. ఈ క్రమంలోనే శామ్యూల్ అమ్మాజీ అనే దంపతులకు జన్మించిన అంకిత్ భార్గవ్ కూడా చిన్నప్పుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడ్డారని మూడు వారాలలో ఆపరేషన్ చేయకపోతే చనిపోతారని డాక్టర్లు తెలిపినట్లు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.
తమ బాబుకి ఐదు నెలల వయసులోనే గుండెలో సమస్య ఏర్పడిందని ఆపరేషన్ చేయించాలి అంటే అధిక మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని డాక్టర్లు తెలిపారు అలాంటి సమయంలో మహేష్ బాబు అభిమానుల ద్వారా ఈ విషయాన్ని మహేష్ బాబు పిఏ వరుకు ఈ విషయాన్ని చేర్చామని ఆ తర్వాత మహేష్ బాబు పిఏ హాస్పిటల్ నుంచి ఫోన్ చేయించి బాబుకు ఆపరేషన్ చేయిస్తామని చెప్పినట్లు ఈ దంపతులు వెల్లడించారు.ఇలా తమ కొడుకుకి మరో జన్మ ఇచ్చిన దేవుడు మహేష్ బాబు అని అతనిని మరోసారి జీవితంలో చూస్తామని ఎప్పుడూ అనుకోలేదని ఈ దంపతులు తెలిపారు.ఒక్కసారిగా మహేష్ బాబుని చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆయన కాళ్ళకు నమస్కరించినట్లు వెల్లడించారు. మహేష్ బాబుని కలిసిన తర్వాత ఆయన బాబుకి ఎలా ఉంది ఇప్పుడు మీరు హ్యాపీ కదా అని అడిగారని ఈ ఇంటర్వ్యూలో ఈ దంపతులు తెలిపారు. నిజంగా దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అనడానికి మహేష్ బాబు నిదర్శనమని ఆయన రూపంలో ఆ బిడ్డను కాపాడారనీ ఈ దంపతులు తెలియజేశారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…