సాధారణంగా పెళ్లి కార్యక్రమంలో శుభలేఖకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ శుభ లేఖ ద్వారా పెళ్లికి బంధువులు అందరినీ ఆహ్వానిస్తున్నాము. అయితే అదే శుభలేఖ ఓ జంటను విడదీయడానికి కారణమయింది. సాధారణంగా పెళ్లిళ్లు చివరి క్షణాల్లో కూడా ఆగిపోతాయి. అయితే పెళ్ళిలో వధూవరులు కుటుంబసభ్యులు గొడవలు కారణంగా, లేదా వధూవరులు ఎవరినైనా ప్రేమించి ఉంటే వారి కోసమో చివరి క్షణాలలో వాయిదా పడుతుంటాయి. కానీ శుభలేఖ ద్వారా పెళ్లి వాయిదా పడిన ఘటన మహారాష్టలోని నాశిక్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ప్రముఖ నగల వ్యాపారి ప్రసాద్ అద్గావ్కర్ కుమార్తె రసిక అంగ వైకల్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెకు ఎలాంటి సంబంధాలు కుదరకపోవడంతో ఆమె పెళ్లి జరగడం లేదు. ఈ క్రమంలోనే ఆమె స్నేహితుడు ఆశిఫ్ ఖాన్ ఆమెను పెళ్లి చేసుకోడానికి ముందుకు వచ్చాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఉండటంతో ఈ పెళ్ళికి ఎలాంటి ఆటంకాలు జరగవని భావించారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల సమక్షంలో నాసిక్ కోర్టులో వీరి పెళ్లిని రిజిస్టర్ చేశారు. జులై 18న స్థానిక ఓ హోటల్లో పెళ్లి వేడుక నిర్వహించాలని భావించారు.
ఈ క్రమంలోనే ఈ పెళ్లి వేడుక కోసం ఇరు కుటుంబాలు వివాహ ఆహ్వాన పత్రిక తయారు చేయించాయి. ఈ శుభలేఖ వాట్సప్ ద్వారా చాలామందికి చేరుకోవడంతో అసలు సమస్య వచ్చి పడింది. బలవంతంగా యువతిని ఒక ముస్లిం యువకుడు ఇచ్చి పెళ్లి చేస్తున్నారని ఆరోపణలు తలెత్తాయి.ఇది కచ్చితంగా ‘లవ్ జిహాద్’ అంటూ నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే కొందరు కమ్యునిటీ పెద్దలు వధువు తండ్రి ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ వేడుకను నిర్వహించవద్దంటూ ప్రసాద్ మీద ఒత్తిడి తెచ్చారు. అదేవిధంగా మరికొందరు తనకు ఫోన్ చేసి ఈ పెళ్లి జరిపించకూడదని బెదిరించారు. ఈ క్రమంలోనే వధువు తండ్రి వీరి వివాహాన్ని రద్దు చేశాడు.అయితే వీరి పెళ్లి కోర్టులో రిజిస్ట్రేషన్ కావడంతో వీరిరువురు కలిసి జీవించినా ఎలాంటి సమస్యలు ఉండవని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…