Uday Kiran: డైరెక్టర్ తేజ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో యాభై లక్షల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా ఏడు కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉదయ్ కిరణ్ వైపు చూసింది.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మొదటి సినిమాతోనే ఇలాంటి హిట్ కొట్టడంతో కొందరు లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను,మనసంతా నువ్వే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ కావడంతో చిత్ర పరిశ్రమ మొత్తం ఉదయ్ కిరణ్ వైపు చూసింది. ఏకంగా 11 బడా బ్యానర్లు ఈయనకు అవకాశం ఇచ్చారు.
ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి తన కూతురు సుస్మితకు ఉదయ్ కిరణ్ కి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అతనితో నిశ్చితార్థం కూడా చేశారు.ఇలా మెగాస్టార్ చిరంజీవి కుమార్తెను ఉదయ్ కిరణ్ కి పెళ్లి చేసుకున్నారనే వార్త తెలియడంతో చాలామంది ఉదయ్ కిరణ్ దశ తిరిగిపోయిందని భావించారు. ఈ నిశ్చితార్థం కోసం ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లింది.
ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు ఏ విధమైనటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఉదయ్ కిరణ్ కు మెగాస్టార్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి గల కారణం సుస్మిత ఉదయ్ కిరణ్ ను ఇష్టపడిన కారణంతోనే అని వార్తలు వచ్చాయి. వీరి నిశ్చితార్థం తర్వాత ఈ జంట విదేశాలకు వెళ్లి షికార్లు కొట్టారు. అయితే ఉన్నఫలంగా వీరిద్దరి వివాహం క్యాన్సిల్ అయిందనే వార్త తెలిసింది.అయితే వీరి వివాహం క్యాన్సిల్ అవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఉదయ్ కిరణ్ ప్రవర్తన నచ్చకపోవడం వల్లే సుస్మిత ఈ వివాహం చేసుకోనని చెప్పినట్లు తెలుస్తోంది.
మెగా కాంపౌండ్ కూడా ఉదయ్ కిరణ్ ప్రవర్తనపై సీక్రెట్ గా గమనిస్తూ వచ్చారని వార్తలు వచ్చాయి.అలా ఉదయ్ కిరణ్ తో మెగా కూతురి వివాహం క్యాన్సిల్ అయింది అని తెలియగానే అతనికి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు కూడా అడ్వాన్సు వెనక్కి తీసుకు వెళ్లారు. ఇలా ఉదయ్ కిరణ్ పతనం అప్పటి నుంచి మొదలైంది. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం కాలేకపోయాయి.ఇక తానే సొంతంగా సినిమా నిర్మించిన అది కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఉదయ్ కిరణ్ విషిత అనే అమ్మాయిని ఎంతో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడం.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించారు.
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…