Nagarjuna: సమంత తండ్రిని కలిసిన నాగార్జున… కారణం అదేనా?
Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య నటి సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత పెళ్లి అప్పట్లో తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని సమంతనే బలవంతంగా వీరి వివాహానికి తన తల్లిదండ్రులను ఒప్పించింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇలా పెద్దలకు ఇష్టం లేకపోయినా, వారిని ఒప్పించి వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.వీరి వివాహం అనంతరం కొన్ని సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన సమంత నాగచైతన్య పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే వీరి విడాకులకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం తెలియలేదు.
నాగార్జున, సమంత తండ్రి ఈ విషయంపై స్పందిస్తూ ఈ విషయంలో పూర్తిగా వారి నిర్ణయాన్ని వదిలేస్తున్నామని వెల్లడించారు.సమంత తీసుకున్న నిర్ణయం వెనుక కారణం ఉంటుందని తన తండ్రి తనకు సపోర్ట్ చేయగా నాగార్జున సైతం విడాకులు తీసుకున్నప్పటికీ సమంత మా ఇంటి బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు.అయితే తాజాగా నాగార్జున ఉన్నఫలంగా సమంత తండ్రిని కలిసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
నాగార్జున సమంత తండ్రితో కలిసి సుమారు గంటకు పైగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే నాగార్జున ఈ విధంగా సమంత తండ్రిని కలవడానికి కారణం ఏంటి అంటూ పెద్దఎత్తున ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు.అయితే గత కొద్దిరోజుల నుంచి నాగచైతన్య రెండవ వివాహం చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై నాగార్జున సమంత తండ్రిని కలిసి వారి భవిష్యత్ గురించి ప్రస్తావించి ఉంటాడని ఇండస్ట్రీ సమాచారం. మరి నాగార్జున ఎందుకు సమంత తండ్రిని కలిసారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు ఎంతో కంగారుగా నాగార్జున తన తండ్రిని కలగడానికి కారణం ఏంటి అంటూ పెద్దఎత్తున చర్చలు మొదలు పెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…