కరోనా రెండవ దేశవ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది యువకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే కరోనా మూడవ దశ చిన్న పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి మన వద్ద ఉన్న ఏకైక అస్త్రం మాస్క్ అని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే కరోనా నుంచి చిన్నపిల్లలను కాపాడుకోవడం కోసం వారికి మాస్క్ వాడటం మంచిదేనా? లేదా? అనే అయోమయంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. అయితే చిన్న పిల్లలకు మాస్క్ ఏ విధంగా ధరించాలి అనే విషయాల గురించి కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ప్రకారం..
ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.6 -11 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు వారు మాస్క్ లను ధరించే సామర్థ్యాన్ని బట్టి మాస్క్ లు వేయాలి.12-17 సంవత్సరాల వయసు కలిగిన వారు పెద్ద వారి మాదిరిగానే యధావిధిగా మాస్క్ ధరించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు తెలిపింది. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఎవరికైనా అనారోగ్యం చేసిన వారి దగ్గరికి వెళ్తున్న సమయంలో తప్పనిసరిగా మాస్క్ వేయాలని తెలిపారు.
చిన్నపిల్లలు మాస్క్ లను వాడే ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడగడం లేదా శానిటైజర్ వాడటం చేయాలి. ఈ క్రమంలోనే అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం 2 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు తప్ప మిగిలిన వారందరూ తప్పకుండా మాస్కు ధరించాలని తెలిపింది.అదేవిధంగా చిన్నపిల్లలు covid బారిన పడితే వారికి ఏ విధమైనటువంటి చికిత్సను అందించాలనే విషయాలను కూడా డీజీహెచ్ఎస్ తాజా మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. కోవిడ్ బారిన పడిన వారికి అత్యవసర పరిస్థితులలో ఉపయోగించే రెమ్డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పిల్లలు కూడా భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలను పాటించాలని డీజీహెచ్ఎస్ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…