అపరిచితుడు సినిమా నుంచి ఐశ్వర్యరాయ్ తప్పుకోవడానికి గల కారణం తెలుసా?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన “అపరిచితుడు” సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో విక్రమ్, సదా జంటగా నటించారు.ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్ లలో నటించిన విక్రమ్ కు ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్ తీసుకొని దర్శకుడు శంకర్ మొట్టమొదటిసారిగా రజనీకాంత్ ని కలిశారు.

ఈ సినిమాలో చేయడం కోసం రజిని ఒప్పుకోకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన శంకర్ ఈ సినిమా కథతో విక్రమ్ ని కలిశారు. ఇక ఈ సినిమా కథ వినగానే విక్రమ్ వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఐశ్వర్యరాయ్ అని శంకర్ భావించారు అయితే ఐశ్వర్య నుంచి కూడా శంకర్ కు చేదు అనుభవం ఎదురైంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో నటించడానికి నో చెప్పడంతో ఈ సినిమాలో సదా హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈ విధంగా అపరిచితుడు సినిమా తెరకెక్కింది. విక్రమ్ భార్య సైకాలజీ చదవడం వల్ల మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి విక్రమ్ కు బాగా వివరించేది. ఆరు నెలలో షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పిన దర్శకుడు ఈ సినిమాకు దాదాపు సంవత్సర కాలం పట్టింది.ఈ విధంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ కలిపి సుమారు 26 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు.

ఈ విధంగా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా 37 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకొని అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలయి మంచి విజయం సాధించిన తర్వాత ఈ సినిమాలో నటించినందుకు ఐశ్వర్య చాలా ఫీల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “రోబో ” సినిమాలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఐశ్వర్య ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.