కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన “అపరిచితుడు” సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో విక్రమ్, సదా జంటగా నటించారు.ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్ లలో నటించిన విక్రమ్ కు ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్ తీసుకొని దర్శకుడు శంకర్ మొట్టమొదటిసారిగా రజనీకాంత్ ని కలిశారు.
ఈ సినిమాలో చేయడం కోసం రజిని ఒప్పుకోకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన శంకర్ ఈ సినిమా కథతో విక్రమ్ ని కలిశారు. ఇక ఈ సినిమా కథ వినగానే విక్రమ్ వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఐశ్వర్యరాయ్ అని శంకర్ భావించారు అయితే ఐశ్వర్య నుంచి కూడా శంకర్ కు చేదు అనుభవం ఎదురైంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో నటించడానికి నో చెప్పడంతో ఈ సినిమాలో సదా హీరోయిన్ గా తీసుకున్నారు.
ఈ విధంగా అపరిచితుడు సినిమా తెరకెక్కింది. విక్రమ్ భార్య సైకాలజీ చదవడం వల్ల మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి విక్రమ్ కు బాగా వివరించేది. ఆరు నెలలో షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పిన దర్శకుడు ఈ సినిమాకు దాదాపు సంవత్సర కాలం పట్టింది.ఈ విధంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ కలిపి సుమారు 26 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు.
ఈ విధంగా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా 37 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకొని అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలయి మంచి విజయం సాధించిన తర్వాత ఈ సినిమాలో నటించినందుకు ఐశ్వర్య చాలా ఫీల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “రోబో ” సినిమాలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఐశ్వర్య ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…