Why are Telugu anchors silent on Udayabhanu's comments?
తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు యాంకర్లకూ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లితెరపై తమ అద్భుతమైన ప్రెజెంటేషన్తో ప్రేక్షకులను అలరిస్తూ, తరచూ కొత్త పంథాలో తమను తాము పరిచయం చేసుకుంటూ యాంకర్లు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా యాంకర్ సుమ అయితే దశాబ్దాలుగా ఎవరూ అందుకోలేని స్థాయిలో కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు యాంకర్ల మధ్య నెలకొన్న ‘సిండికేట్’ వివాదం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు ఝాన్సీ, ఉదయభాను వంటి యాంకర్లు ఇండస్ట్రీలో రాణించారు. ఎన్నో షోలను హోస్ట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కాలక్రమంలో ఝాన్సీ సినిమాల వైపు మొగ్గుచూపి యాంకరింగ్కి విరామం ఇచ్చింది. ఉదయభాను కూడా దాదాపు దశాబ్దకాలంగా యాంకరింగ్లో కనిపించలేదు. తాజాగా సుహాస్ సినిమా ఈవెంట్ కోసం ఆమె మళ్లీ యాంకర్గా కనిపించింది. ఆ ఈవెంట్లో సుహాస్, “ఈ షోకు ఉదయభాను యాంకర్ అని తెలిసి వచ్చాను” అని చెప్పగా, ఉదయభాను కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు:
“చాలా రోజులుగా యాంకరింగ్ చేయాలని అనుకుంటున్నా, కానీ ఇప్పుడున్న సిండికేట్ యాంకర్ల వల్ల నాకు అవకాశాలు రావడం లేదు.“
ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, ముఖ్యంగా యాంకర్ల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి.
ఉదయభాను వ్యాఖ్యలు ఇలా ఉండగా, ఇటీవల జబర్దస్త్ షో 12 ఏళ్ల సెలబ్రేషన్స్ను నిర్వహించింది. ఈ ప్రత్యేక సందర్భానికి పాత జబర్దస్త్ టీమ్ సభ్యులందరినీ ఆహ్వానించారు. ఈ వేడుకకు అనసూయ కూడా హాజరైంది. ఇటీవల విడుదలైన ప్రోమోలో రష్మీ స్టేజ్పై ఎమోషనల్గా ఏడ్చేయగా, అనసూయ కూడా భావోద్వేగానికి గురైంది.
అనసూయ మాట్లాడుతూ, “నేను కొంతమందితో ప్యాచప్ చేసుకోవాలి” అంటూ రష్మీని హత్తుకోవడంతో, రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. అనసూయ మరింతగా మాట్లాడుతూ, “ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలిసిపోతున్నాయి. ఈ ప్యాచప్ వల్ల ‘ఇద్దరూ మాటాడుకోవట్లేదా’ అనే డౌట్లు క్లియర్ అయ్యాయి” అని చెప్పింది. దీనికి రష్మీ స్పందిస్తూ, “అదేదో వాట్సాప్లో గాని, ఫోన్లో గాని మాట్లాడి ఉంటే అయిపోయేది కదా?” అని చెప్పగా, అనసూయ, “అలా అయితే చాలా ఇగోలు అడ్డు వచ్చేవి” అని జవాబిచ్చింది.
ఈ సంఘటనతో గత కొంతకాలంగా అనసూయ–రష్మీ మాట్లాడుకోవట్లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇది వర్క్ బిజీ కారణంగానా, లేక ఏవైనా విబేధాల వలనో అన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్యాచప్ పూర్తి వివరాలు జబర్దస్త్ 12 ఏళ్ల స్పెషల్ ఎపిసోడ్లో బయటపడే అవకాశం ఉంది. ఈ ఫుల్ ఎపిసోడ్ ఆగస్టు 8, 9 తేదీల్లో రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.
ఉదయభాను చేసిన వ్యాఖ్యలపై ఇతర యాంకర్లు ఎలా స్పందిస్తారన్న ఆసక్తి పెరిగింది. కానీ ఇప్పటివరకు ఎవరూ ఉదయభాను మాటలను ఖండించలేదు. తాజాగా యాంకర్ ప్రత్యూషను దీనిపై అడగగా, “నేను నిజాలు మాత్రమే చెప్తాను, కానీ మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదు” అని సమాధానం ఇచ్చింది. సుమ, ఝాన్సీతో పాటు మిగతా యాంకర్లు కూడా ఈ విషయంలో ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం గమనార్హం.
దీంతో ఉదయభాను చేసిన వ్యాఖ్యల వెనుక నిజం ఉందా? లేక ఇతర యాంకర్లు కావాలనే ఆమెను పక్కన పెట్టారా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఎవరికి వారు తమ షోలతో రాణిస్తే చాలని, ఒకరిని తొక్కి ఎదగడం వల్ల ఎలాంటి లాభం ఉంటుందనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదం తెలుగు టీవీ పరిశ్రమలోని అంతర్గత డైనమిక్స్ను మరోసారి బయటపెట్టింది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…