శ్రావణమాసం రాగానే చాలామంది పాలను తాగరు. వాటిని దూరంగా ఉంచుతారు. దానికి గల కారణం ఏంటనేది చాలామందికి తెలవదు. లక్ష్మీదేవికీ, శివుడికీ ప్రీతిపాత్రమైన శ్రావణమాసం రాగానే ఎందుకు తాగరు అనే ప్రశ్న చాలా మంది మనసులో ఉంటుంది. దానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు పురాణాల్లో పాల సముద్రం నుంచి విషం బయటకు వచ్చింది.
ఆ విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకున్నట్లు పురాణాల ప్రకారం తెలుస్తోంది. అందువల్లే శ్రావణమాసంలో పాలకు దూరంగా ఉంటుంటారు. పూజకు తీసుకెళ్లిన పాలను స్వామికే అభిషేకం చేస్తే పరమేశ్వరుడి కృప పొందాలని భక్తులు అలా చేస్తారనే ప్రతీతి ఉంది. దీని వెనుక సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో పురుగులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి.
గేదెలు, ఆవులు తినే గడ్డిలో కూడా ఆ పురుగులు దాగి ఉంటాయి. పశువులు వాటిని తినేస్తాయి. దీంతో పాలలో హానికరమైన పదర్ధాలు ఉంటాయని.. అందువల్ల శ్రావణమాసంలో పాలను తాగరని చెబుతుంటారు. వ్యాధుల బారిన పడకుండా ఇలా పాలకు దూరంగా ఉంటడం మంచిదని పండితులు చెబుతుంటారు. అంతేకాకుండా వానాకాలంలో మనిషి వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.
ఉపవాస దీక్షలు చేయడంతో పొట్ట ఖాళీగా ఏర్పడుతుంది. అందులో పాలను తాగడం వల్ల అవి సరిగ్గా అరగవు. దీంతో గ్యాస్, డయేరియా, ఎసిడిటీ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. అందువల్ల పాలు తాగకపోయిన నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తే మంచిది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…