Categories: General News

ఆశీర్వచనాలలో తలపై అక్షింతలు ఎందుకు వాడతారో తెలుసా ?!

ఒకరిని దీవిస్తున్నపుడు, శుభ కార్యాల్లో, పూజల్లో భాగంగా అక్షింతలు వాడటం ఒక సంప్రదాయంగా పాటిస్తాం. అవే ఎందుకు అని చాలా మందికి సందేహం ఉంటుంది. వాటికి బదులు రకరకాల పూలు వేయొచ్చు కదా అన్న సందేహం వస్తుంది. పూల కన్నా, అక్షింతలు వాడటం వెనుక అంతరార్థం పెద్దదే అంటున్నాయి పురాణాలు. అక్షింతలు అంటే క్షతము (నాశనం) కానివి అని అర్థం. బియ్యం శుభానికి, సమృద్దికి సంకేతం. పసుపు క్రిమి సంహకరాలను నివారిస్తుంది. ఈ రెండిటినీ కలపడం వల్ల ఆరోగ్యకరమైన అభివృద్ధి సొంతమవుతుంది. అందుకే దీవించేందుకు వీటిని ఉపయోగిస్తారు.

అయితే వాటిని ఎలా పడితే అలా వేయకుండా పెద్దవాళ్ళు, చిన్నవాల్ల తలలోని బ్రహ్మరంధ్రం పైన పడేలా అక్షింతలు వేస్తూ దివించాలి. దాని వల్ల అక్షతమైన ఆయురారోగ్యాలు, ఎలాంటి ఆటంకాలు లేని అభివృద్ధి సిద్ధిస్తాయని చెబుతారు. అక్షింతల్ని అలా తలలోని బ్రహ్మరంధ్రం పైన చల్లడం వల్ల శరీరంలో సానుకూల తరంగాలు ఉత్తేజిత అవుతాయి. ఇక పూజలో భాగంగా కొన్నిసార్లు గంధం కానీ, కుంకుమ కానీ సరిపడా పువ్వులో అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాటన్నిటికీ బదులుగా అక్షింతలు వాడటం సరైన పరిష్కారం అని శాస్త్రాలు చెబుతున్నాయి.

అంటే అక్షింతలు పూజా సామాగ్రిలోని లోటును పూడ్చందుకు ఉపయోగ పడతాయి అందుకే అలా వాడిన అక్షింతలనే పూజ అంతా అయ్యాక తలపై చల్లుతారు. కేవలం వాడటమే కాదు, వీటిని తయారు చేసుకునే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సంపూర్ణంగా ఉండే బియ్యపు గింజల్నే అక్షింతలు తయారీకి ఎంచుకోవాలి. బియ్యం కూడా తెల్లగా, శుభ్రంగా ఉండాలి. వాటిలో ఆవు నెయ్యి, పసుపు కలిపినప్పుడు అవి సరైన అక్షింతలు అవుతాయి. దేవీ పూజలో కొన్ని సార్లు పసుపుకు బదులుగా కుంకుమను వాడుతుంటారు కాబట్టి సందర్భాన్ని బట్టి రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఈ రోజు రాశి ఫలాలు.. వృశ్చిక రాశికి శుభసూచనలు, మిగతావారికి హెచ్చరికలు!

2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…

4 minutes ago

శని బాధలకు ఉపశమనం.. గుజరాత్‌లోని ఈ హనుమ ఆలయం ఎందుకు ప్రత్యేకం?

గుజరాత్‌లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…

34 minutes ago

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

10 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

10 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

10 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

10 hours ago