Womens: దహన సంస్కారాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు..! దూరంగా ఉండటానికి కారణం ఏంటి..?
Womens: ఇతర మతాలతో పోలిస్తే సంప్రాదాయ పరంగా హిందువుల సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. పూర్వకాలం నుంచి వచ్చే ఆచార వ్యవహారాలను ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. అయితే వీటన్నింటికి ఎంతో కొంత సైంటిఫిక్ కారణాలు కూడా ఉంటాయి.
భూమిపై పుట్టినప్పటి నుంచి చనిపోయే దాకా ఈ ఆచారాలు పాటిస్తూనే ఉంటాం. మనిషి చనిపోయినప్పుడు కూడా వీటిని మరింత ఎక్కువగా పాటించడం మనం చూస్తూనే ఉంటాం. మనిషి చనిపోయినప్పుడు అతని ఆత్మ వెళ్లాలని ప్రార్థిస్తూ దహన సంస్కారాలు చేస్తుంటాం.
అలాగే దింపుడుకళ్లెం వంటి ఆచారాలను నిర్వహిస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. మనిషి చనిపోయిన తర్వాత పూడ్చడమో.. లేక కాల్చడమో చేస్తుంటారు. ఇదిలా ఉంటే హిందూ సంప్రదాయాల ప్రకారం మహిళలను శ్మశాన వాటికకు రాకుండా.. దహన సంస్కారాల్లో పాల్గొనరు. అయితే అసలు ఈ కార్యక్రమాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషులతో పోలిస్తే మహిళలు తొందరగా భావోద్వేగానికి గురవుతారు. దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో భావోద్వేగాలతో మెంటల్ గా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. దీంతో మహిళలను దహన సంస్కారాలకు దూరంగా ఉంచుతారు. పూర్వకాలం నుంచి ఎవరి ఇంట్లో అయిన ఓ మనిషి చనిపోతే.. ఆ ఇంట్లో పిల్లల్ని, ముసలి వారిని చూసుకుంటూ.. ఇళ్లు శుభ్రం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో శ్మశాన వాటికలకు వెళ్లేవారు కాదు. దహన సంస్కారాలకు వెళ్లి వచ్చేవారికి భోజనం చేసేవారు. ఇదిలా ఉంటే శ్మశాన వాటికలల్లో దుష్టశక్తులు ఉంటాయని నమ్ముతుంటారు. దీంతో మహిళలకు పెద్ద జుట్టు ఉండటంతో ఆవహించే ప్రమాదం ఉంటుందని నమ్ముతారు. ఆలాగే గర్భం దాల్చిన మహిళలు శ్మశాన వాటికలు వెళ్లడం నిషేధంగా ఉంది హిందూ సంప్రదాయంలో.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…