Digital Payment Apps: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లకు డబ్బులు ఎలా వస్తాయి..! ఆ వివరాలు తెలుసుకోండి..!
Digital Payment Apps: డిజిటల్ టెక్నాలజీ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా.. స్మార్ట్ ఫోన్లతోనే పనులు అన్నీ జరిగిపోతున్నాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మొత్తం దేశాన్ని డిజిటల్ వైపు అడుగులు వేసే దిశగా బడ్జెట్ లో ప్రస్తావించారు.
అందులో భాగంగానే రైతులకు డ్రోన్లతో పాటు.. చదువుకునే విద్యార్థులకు ఫోన్లను సమకూర్చనున్నట్లు తెలిపారు. అయితే పెద్ద నోట్లు రద్దు అయిన దగ్గర నుంచి కూడా ప్రతీ ఒక్కరి మొబైల్ ఫోన్లలో డిజిటల్ పేమెంట్ యాప్ లు ఉంటున్నాయి.
డిజిటల్ కరెన్సీని వాడాలని.. ఫిజికల్ కరెన్సీని తగ్గించాలని ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువగా డిజిటల్ పేమెంట్ యాప్ లల్లో ఉపయోగించేవి పేటీఎం, ఫోన్ పే మరియు గూగుల్ పే. వీటిని ఉపయోగించి ఎక్కువ శాతం డబ్బులను ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు.
అయితే వీటి ద్వారా ఇలా ట్రాన్సా క్షన్స్ చేస్తే వీటికి వచ్చే లాభం ఏంటి అనేది ప్రతీ ఒక్కరికీ కలిగే ప్రశ్న. దాని గురించి తెలుసుకుందాం. ఈ యాప్ ల నుంచి ఎన్నో రకాల సేవలను పొందొచ్చు. అందులో ముఖ్యంగా మొబైల్ రీచార్జ్. యాప్ నుంచి రీచార్జ్ చేసుకుంటే టెలికాం కంపెనీ వాళ్ళు కమీషన్ ఇస్తారు. టీవీ రీచార్జ్ లు అయినా సరే అంతే ఉంటుంది. హోటల్ బుకింగ్స్ చేసుకున్నా సరే కమీషన్ వస్తుంది. ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇలా కమీషన్ బేస్ ద్వారా వాళ్లు డబ్బులను సంపాదిస్తుంటారు. పలు కంపెనీలు ఇచ్చే కూపన్ల ద్వారా కూడా మనీ సంపాదిస్తుంటాయి. ఇలా ఆ కూపన్ ఆధారంగా కొనుగోలు చేసినా సరే కొంత కమీషన్ ఇస్తారు. ప్రతీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చొకొని.. కమీషన్లను పొందుతారు. ఇక ఇలా యాప్ లను ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే.. ఆ రకంగా కూడా మనీ సంపాదిస్తుంటారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…