Categories: General News

Crime : వామ్మో ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ప్రియుడి కోసం భర్తను లేపేసిన భార్య! సాంబారులో విషం కలిపి దారుణం!

ధర్మపురి, తమిళనాడు: ఇటీవల కాలంలో వివాహానంతరం జరుగుతున్న హత్యలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రేమ, విశ్వాసం అనే బంధాలను తుంచేసి, న్యాయమైన సంబంధాన్ని కొందరు క్రూరంగా అంతమొందిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో చోటుచేసుకున్న ఘటన అదే విధంగా తీవ్రంగా కలిచివేసింది.

Wife who poisoned her husband to death… conspired with her boyfriend!

భర్తకు విషమిచ్చి చంపిన భార్య

ధర్మపురి జిల్లాకి చెందిన రసూల్ (35) ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య అమ్ముబీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ రోజు రసూల్ అనారోగ్యానికి గురై వాంతులు చేసుకొని స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పురుగుల మందు వల్ల విషతుల్యంగా మారిన ఆహారం తీసుకున్నట్లు వెల్లడించారు.

చాటింగ్‌లతో బయటపడిన కుట్ర

ఈ విషయంపై అనుమానం గలిగిన కుటుంబ సభ్యులు అమ్ముబీ మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించగా, ఆమె స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది. ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్‌లో మరింత హృదయద్రావక సత్యాలు బయటపడ్డాయి.

చాటింగ్‌లో అమ్ముబీ, “నువ్విచ్చిన విషం మొదట దానిమ్మ రసంలో కలిపాను. కానీ అది తాగలేదు. తర్వాత సాంబార్‌లో కలిపాను” అంటూ లోకేశ్వరన్‌కు చెప్పినట్లు స్పష్టమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు, రిమాండ్

విషం తినిపించడం ద్వారా భర్తను హత్య చేయడమే కాకుండా, ఇది ప్రేమ పేరుతో చేస్తున్న అతి దుర్మార్గ చర్యగా మిగిలిపోతోంది. రసూల్ మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది.

వెంటనే స్పందించిన పోలీసులు అమ్ముబీ, లోకేశ్వరన్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరినీ రిమాండ్‌కు తరలించగా, పూర్తి విచారణ కొనసాగుతోంది.

ఈ ఘటన మనకు పెళ్లి అనేది కేవలం బంధం మాత్రమే కాదు, నమ్మకం, బాధ్యత అనే విషయాలను గుర్తుచేస్తోంది. అలాంటి బంధాన్ని ఇంతే దారుణంగా మోసం చేస్తే, సమాజంలో ఆ బంధాల మీదే అపార్థాలు పెరుగుతాయి. సమాజం దీనిపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago