Vijay Devarakonda-Rashmika: ప్రస్తుతం హీరోయిన్లలో ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఆమె పేరు ప్రస్తుతం క్రష్మికగా మారిపోయింది. నేషనల్ క్రష్ అని ఆమెను కొంతమంది పిలుస్తారు. అలా ఆమె పేరును క్రష్మికగా సంభోదిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి రష్మికకు , విజయ్ దేవరకొండకు మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి.
గీతాగోవిందం సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాతో రష్మిక టాలీవుడ్ లో బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. కాగా, విజయ్ కి క్లాస్ హీరోగా పేరు వచ్చింది. ఆ సమయం నుంచే పాపులర్ జంటగా మారిపోయారు. ఇక ఈ సినిమా తరువాత ఈ జంట డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు.
దీని తర్వాత వీళ్లిద్దరు కలిసి హోటల్స్ కు వెళ్లడం.. డిన్నర్లు, డేట్స్ అంటూ.. ఇలా కెమెరాలకు చిక్కడంతో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇక కొత్త ఏడాది వీళ్లిద్దరు కలిసి ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని.. దీనికి సంబంధించి బాలీవుడ్ కు చెందిన ఓ టాబ్లైడ్ ప్రకారం తెలుస్తోంది. ఆ కీలక ప్రకటన వారి రిలేషన్ గురించే అయ్యి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
దీంతో వాళ్లు ఏం చెప్పబోతున్నారు..? వారి ప్రేమను ప్రకటించనున్నారా.. లేదా.. పెళ్లి గురించి ఏమైనా గుడ్ న్యూస్ చెబుతారా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ఈ రోజు జనవరి 1 కనుకు.. ఏ సమయంలో అయినా ఈ జంట.. తమ మనస్సులో ఉన్నది చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రష్మికకు అంతకముందే.. హీరో రక్షిత్ శెట్టి తో ఎంగేజ్ మెంట్ జరిగి క్యాన్సిల్ అయింది. దీని తర్వాతనే విజయ్ తో కలిసి డేటింగ్ కు వెళ్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది ఎంత వరకు నిజమో.. కొన్ని గంటలు ఆగితే తెలుస్తుంది.
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…