ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన విప్రో కరోనా సంక్షోభ సమయంలో కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ 2021 ద్వారా దేశంలోని ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధమైంది. ప్రతిభ ఉండి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు విప్రో కంపెనీ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలను పొందవచ్చు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో చదివిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 5వ తేదీ అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి సందేహాలు ఉంటే manager.campus@wipro.com కు మెయిల్ చేయడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
2021 సంవత్సరం జనవరి 18వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు మూడున్నర లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. పదో తరగతి, ఇంటర్ 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో గ్యాడ్యుయేషన్ 65 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
10వ తరగతి, గ్రాడ్యుయేషన్ మధ్య మూడు సంవత్సరాలు గ్యాప్ లేని విద్యార్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన కాలేజీల నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సు చదివి సెలక్షన్ నాటికి బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…